అయితే సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరచయం అయిన నిధి అగర్వాల్ తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ను చిత్రంలో నటించింది. కానీ ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ ముందు విజయం సాధించలేకపోవడంతో నిధికి పెద్దగా పేరు రాలేదనే చెప్పాలి. అడపా దడపా చిన్న చిన్న హీరోలతో నటించి నటనలో మంచి పేరు తెచ్చుకున్నా పెద్దగా హిట్ కొట్టలేకపోయింది. అయితే ఇటీవల రామ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మంచి హిట్ కొట్టడంతో నిధి అగర్వాల్ క్రేజ్ కూడా పెరిగిపోయింది. సినిమా ఇండస్ట్రీలో ఒక్క హిట్ కొడితే చాలు నటినటులు యొక్క రెమ్యునరేషన్ కూడా ఇట్టే మారిపోతుంది. అయితే గల్లా అశోక్ సినిమాలో నిధి నటించడానికి దాదాపుగా కోటి రూపాయలకి పైగా రెమ్యునరేషన్ తీసుకుంటుందని సినీ వర్గాల నుంచి అందిన సమాచారం. ఏది ఏమైనా ఇస్మార్ట్ శంకర్ హిట్తో నిధి క్రేజే పెరిగిపోయింది. ఒక్కసారిగా భామ డిమాండ్ అమాంతం పెంచేసిందనే చెప్పాలి. ఇకపోతే నిధి అందాలు ఆరబోయడంలో కూడా ఏమీ వెనుకాడదు.