బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్..ఏ వుడ్ అయినా హీరోయిన్స్ కు క్రేజ్ ఉన్నప్పుడు మాత్రమే కుప్పలు తెప్పలుగా ఆఫర్లు వస్తాయి. అయితే ఏమాత్రం క్రేజ్ లేని ఒక్కరు ఇద్దరు హీరోయిన్స్ మాత్రం ఏదో రకంగా అడ్డ దారుల్లో అవకాశాలు దక్కించుకుంటారంటూ ప్రేక్షకుల్లో గుసగుసలు వినిపిస్తుంటాయి. మన టాలీవుడ్ లో సినిమాలకు సంబంధించిన ఒప్పంద విషయాలను మేనేజర్లు చూస్తారు. కాని బాలీవుడ్ లో మాత్రం పార్టీల కు తిరుగుతూ ఎప్పుడు బాలీవుడ్ ప్రముఖుల దృష్టిలో ఉంటేనే అవకాశాలు వస్తాయంటూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడిది హాట్ టాపిక్ అవుతోంది.

అవకాశాలు కావాలంటే పార్టీల కు వెళ్లాల్సిందే.. నిర్మాతలు ప్రొడక్షన్ టీం కోరినప్పుడు ఎక్కడికంటే అక్కడకు వెళ్లాల్సిందేనా అంటూ ఆమెను ప్రశ్నించగా అవకాశాలు కావాలంటే అలాంటి పనులు చేస్తూ ఉంటారు. కాని అలా చేయడం వల్ల అవకాశాలు వస్తాయని నేను అనుకోను అంటూ తిరిగి తనే అంటోంది. ఈమద్య కాలంలో టాలెంట్  ఉన్న వాళ్ళకి మాత్రమే భారీగా ఆఫర్లు వస్తున్నాయి. కంటెంట్ బేస్ చేసుకుని ఛాన్స్ లు ఇస్తూ ఉంటారు. పార్టీలకు పబ్ లకు తిరిగినంత మాత్రాన ఛాన్స్ లు వచ్చే కాలం పోయిందని రకుల్ తన వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తం చేసింది.

టాలీవుడ్, కోలీవుడ్ లో రెండు మూడు సంవత్సరాలు ఒక ఊపు ఊపిన రకుల్ గత కొన్నాళ్లు గా చతికిల పడింది. బాలీవుడ్ లో కూడా రకుల్ బాగానే ప్రయత్నాలు చేస్తోంది. కాని చిన్నా చితకా పాత్రలు తప్ప ఈ బ్యూటీకి మళ్లీ గట్టి మూవీ ఒక్కటి పడటం లేదు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోన్న రకుల్ కి మళ్లీ మంచి ఆఫర్లు వస్తాయా..అంటే కాస్త అనుమానంగానే అనిపిస్తోంది. ఈ విషయంలో తాప్సీ ఎంతో గ్రేట్ అని చెప్పొచ్చు.  ఇక రకుల్ ఆ మధ్య అజయ్ దేవగన్, టబు లతో కలిసి 
'దే దే ప్యార్ దే' సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి సక్సస్ ను అందుకుంది. అయితే క్రెడిట్ మాత్రం అజయ్, టబులకు వెళ్ళిపోయింది. అందుకే ఈ సారీ సోలో హీరోయిన్ గా సక్సస్ అవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: