టాలీవుడ్,
బాలీవుడ్ లో ఎన్నో సంచలన సినిమాలు తీసి సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు రాంగోపాల్ వర్మ.
బాలీవుడ్ లో ఎన్నో కాంట్రవర్సీ మూవీస్ తీసిన ఆయన కొంత కాలంగా వరుస అపజయాలు పొందడంతో
టాలీవుడ్ మకాం మర్చారు. కొంత కాలంగా సినిమాల
కన్నా ట్విట్టర్ లోనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. సినీ, రాజకీయ, క్రీడా ఇతర రంగాలకు చెంది ఏ ఒక్కరినీ వీడవకుండా తనదైన స్టైల్లో కౌంటర్ ఇస్తూ..సెటైర్లు వేస్తూ వస్తున్నారు. గత కొంత కాలంగా వర్మ తెలుగు లో తీస్తున్న సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అవుతున్నాయి. ఆ మద్య
నాగార్జున తో తెరకెక్కించిన ‘ఆఫీసర్’
మూవీ దారుణమైన డిజాస్టర్ అయ్యింది. ఇటీవల ఏపిలో ఎన్నికల సందర్భంగా
రాంగోపాల్ వర్మ మరో సంచలనానికి తెర లేపారు.
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’
మూవీ తెరకెక్కించి ఏకంగా రాజకీయ దుమారమే లేపారు. ఈ
మూవీ రిలీజ్ పై అప్పట్లో
టీడీపీ నేతలు ఏకంగా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. మొత్తానికి ఎన్నికల తర్వాత లక్ష్మీస్
ఎన్టీఆర్ రిలీజ్ అయ్యింది. తాజాగా
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా
మూవీ ‘కమ్మ రాజ్యంలో
కడప రెడ్లు’. ఈ
మూవీ రిలీజ్
కన్నా ముందు అప్పుడే ఎన్నో సంచలనాలు సృష్టిస్తుంది. ఈ మద్య టీజర్ కూడా రిలీజ్ చేశారు. సమకాలీన రాజకీయా నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో క్యారెక్టర్స్ కి తగ్గ రూపం ఉన్నవాళ్లను తీసుకొని మరో సెన్సేషన్ సృష్టిస్తున్నారు.
ఇప్పటికే సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ సంపాదించేసుకుంది. ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లతో తలపండిన వర్మ, తాజాగా సినిమాకి సంబంధించిన పప్పు లాంటి అబ్బాయి అనే సాంగ్ ని రిలీజ్ చేసాడు. దీనికి
తండ్రి కొడుకుల మధ్య పాట అని వర్మ ట్వీట్ చేసాడు. అంతే కాదు ఈ
సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.. ఈసందర్భంగా
సినిమా యూనిట్ మొత్తం కలిసి పార్టీ చేసుకున్నారు. పార్టీలో పప్పులాంటి అబ్బాయికి వర్మ స్టెప్పులేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.