టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు అనే కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ సరసన తొలిసారి రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా అనిల్ సుంకర, మహేష్, దిల్ రాజు కలిసి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఇంట్రో టీజర్ తో పాటు మొన్న దీపావళి కానుకగా రిలీజ్ అయిన పోస్టర్లు ప్రేక్షకుల్లో సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ద్వారా సీనియర్ నటి విజయశాంతి చాలా రోజుల తరువాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తుండగా, 

ఆమెతో పాటు మరొక నటి సంగీత, కమెడియన్ బండ్ల గణేష్ కూడా సినిమాల్లోకి పునఃప్రవేశం చేస్తున్నారు. ఇక ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా తాజా షెడ్యూల్ ని కేరళలో జరుపుతోంది సినిమా యూనిట్. కాగా సినిమాలోని ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటోందని, అలానే మహేష్ బాబు రష్మిక ల మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ ని కూడా ఈ షెడ్యూల్ లో తీయనున్నట్లు టాక్. ఇకపోతే కాసేపటి క్రితం ఈ షెడ్యూల్ లోని మహేష్ బాబు లేటెస్ట్ పిక్ ఒకటి బయటకు రావడం జరిగింది. 

లొకేషన్లో ఒక అభిమానితో మహేష్ బాబు దిగిన ఈ ఫోటో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా హల్ చల్ చేస్తోంది. ఈ ఫొటోలో మహేష్ ని చూస్తే, నిజంగా ఆయన వయసు పెరుగుతుందా లేక తగ్గుతుందా అనేది మాత్రం అర్ధం కాదు అనే చెప్పాలి. అంతలా మహేష్ బాబు ఈ ఫొటోలో ఎంతో యంగ్ గా కనపడుతున్నారు. దీనిని బట్టి చూస్తే సినిమాలో మహేష్ బాబు లుక్ అదిరిపోవడం ఖాయమని అంటూ పలువురు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: