పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోయే తదుపరి సినిమా విషయమై కొద్దిరోజుల క్రితం ఒక ప్రకటన రావడం జరిగింది. ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకున్న పింక్ సినిమాను తెలుగులో పవన్ హీరోగా రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటన వచ్చింది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, టాలీవుడ్ నిర్మాతైన దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ సినిమాకు యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. గత ఏడాది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి నటించిన అజ్ఞాతవాసి సినిమా తరువాత పూర్తిగా సినిమాలకు విరామం ప్రకటించిన పవన్, అప్పటినుండి తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. 

అయితే ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోవడంతో ఇకపై పార్టీ పార్టీ కార్యక్రమాలపైనే పూర్తిగా దృష్టి పెట్టిన పవన్, మరోవైపు చివరి సినిమా అజ్ఞాతవాసి భారీ ఫ్లాప్ అవడంతో, ఫ్యాన్స్ కోరిక మేరకు సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సంసిద్ధం అవుతున్నారు. అతిత్వరలో గ్రాండ్ గా ప్రారంభం కాబోతున్న ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికానున్నాయి. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్సినిమా తరువాత అవకాశం ఉన్నంతవరకు మరొక్క సినిమాలో మాత్రమే నటిస్తారని అంటున్నారు. 

ఇప్పటికే ఆయన కోసం దర్శకుడు క్రిష్ ఒక అద్భుతమైన కథను రెడీ చేస్తున్నారని, ఆ సినిమా కూడా చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక ఈ రెండిటి తరువాత పవన్ పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవ్వనున్నట్లు గట్టిగా వార్తలు వస్తున్నాయి. తమ అభిమాన హీరో మళ్ళి సినిమాల్లోకి వస్తున్నారనే వార్త పవన్ ఫ్యాన్స్ కు శుభవార్తే అయినప్పటికీ, మరొక రెండు సినిమాలు మాత్రమే చేస్తారు అనేది మాత్రం ఒకరకంగా దుర్వార్త అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది......!!


మరింత సమాచారం తెలుసుకోండి: