స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్  త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో  తాజా చిత్రం “అల వైకుంఠపురములో”. అలాగే  సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న  అనిల్‌రావిపూడి ద‌ర్శ‌త్వంలో “సరిలేరు నీకెవ్వరు” చిత్రాల తాలూకా విడుదల తేదీలను ప్రకటించినప్పటి నుంచి కూడా తెలుగు సినీ వర్గాల్లో ఆసక్తికర వాతావరణం నెలకొంది. ఇద్దరు పెద్ద స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజున విడుదల అనే సరికి అభిమానులు మొదట రోషంతో మీరా మేమా అన్నట్టుగా ప్రవర్తించారు కానీ ఇప్పుడిప్పుడే ఇద్దరి హీరోల అభిమానులు ఒకే రోజున రావ‌డం విషయాన్ని త‌లుచుకుంటుంటే... కానీ ఈ ఇద్దరి సినిమాలు వస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయా అని ఆలోచించడం మొదలు పెట్టారు.

ఒకవేళ నిజంగానే ఈ రెండు చిత్రాలు ఒకే రోజున అంటే జ‌న‌వ‌రి 12న  విడుదల అయితే తప్పకుండా ఇద్దరికీ నష్టాలు తప్పవు అందువల్ల అభిమానులు సహా బయ్యర్లు కూడా భయపడుతున్నారు. దీనితో ఈ సమస్యకు ఒక ముగింపు ఇవ్వాలని మహేష్ మరియు బన్నీలు అనుకుంటున్నట్టు సమాచారం.  పండ‌గ‌కి ఎక్కువ‌గా సినిమాలు రిలీజ్ కాకుండా చూసుకుంటారు. ఇద్ద‌రు పెద్ద స్టార్లు థియేట‌ర్ల స‌మ‌స్య వ‌స్తుంద‌నే భావ‌న‌తో ఇటు బ‌య్య‌ర్లు, అటు ఫ్యాన్స్ బెంబేలెత్తిపోతున్నారు. ఈ విష‌యం పై ప్రొడ్యూస‌ర్లు కూర్చుని చర్చించుకుంటారు. ఇది ఒక ఆచారం గ‌తంలో కూడా ఇలాంటి ప్రాబ్ల‌మ్స్ వ‌చ్చేవి. మ‌రి వీళ్ళిద్ద‌రే కాకుండా బాల‌కృష్ణ సినిమా కూడా అప్పుడే విడుద‌ల‌య్యే ఛాన్స్‌లు ఎక్కువ ఉన్నాయి. మొత్తానికి షూటింగ్ లో బిజీ గా ఉన్న వీరు వీలు చూసుకొని తమ తమ నిర్మాతలు, చిత్ర యూనిట్లతో కలిసి ఒక మీటింగు ఏర్పాటు చేసి విడుదల తేదీల పట్ల ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోడానికి ఆలోచిస్తున్నట్టు సినీ వర్గాల నుంచి సమాచారం. మరి ఈ ఇద్దరిలో ఎవరు తగ్గుతారో ఎవరు తగ్గరో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: