టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల వరుసగా భరత్ అనే నేను, మహర్షి సినిమాల భారీ సక్సెస్ లతో మంచి జోరుమీదున్నారు. ఇక ప్రస్తుతం తాను నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరొక హిట్ ని తన ఖాతాలో వేసుకుని కెరీర్ లో తొలిసారి హ్యాట్రిక్ విజయాలను అందుకోవాలని కసిగా పని చేస్తున్నారు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వరుస సక్సెస్ ల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు ఎంతో భారీగా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 

లేడీ అమితాబ్ విజయశాంతిసినిమా ద్వారా టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఎడిటింగ్ ని తమ్మిరాజూ అందిస్తుండగా, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని, రత్నవేలు ఫోటోగ్రఫిని అందించడం జరుగుతోంది. ఇక అతి త్వరలో ఈ సినిమా టీజర్ మరియు సాంగ్స్ యూట్యూబ్ లో సందడి చేయనున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక మందన్న సినిమా సంగతులు విషయమై తన సన్నిహితులతో ఇటీవల ఈ విధంగా ప్రస్తావించిందట. సినిమా షూటింగ్ జరుగుతున్నంతసేపూ అదేదో ఒక ఇంట్లో పండుగ మాదిరిగా ఉందని, అలానే సెట్ లోని ప్రతి ఒక్కరూ కూడా తనతో ఎంతో సరదాగా కలుపుగోలుగా ఉండడం చూసి తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పిందట. 

ఇక మరీ ముఖ్యంగా హీరో సూపర్ స్టార్ మహేష్ గారిని చూస్తుంటే, ఈయన నిజంగా సూపర్ స్టారేనా అని తనకు అనుమానం వచ్చిందని, ఎందుకంటే సెట్లో ఆయన అడుగుపెట్టిన తరువాత లైట్ బాయ్ దగ్గరి నుండి డైరెక్టర్ గారి వరకు అందరితో మహేష్ గారు ఎంతో కలుపుగోలుగా తన ఫ్యామిలీ మాదిరిగా మాట్లాడడం చూసి తనకు ఎంతో ఆశ్చర్యం వేసిందట. ఇక అంత పెద్ద సూపర్ స్టార్ అయి ఉండి కూడా ఏదైనా సీన్ ని దర్శకుడి కోసం ఎన్నిసార్లు అయినా రీటేక్ చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉంటారని, అలానే సెట్లో అయన ఇచ్చే జోష్ అందరికీ మంచి టానిక్ లా పనిచేస్తుందని తన సన్నిహితుల వద్ద ప్రస్తావించిందట రష్మిక. కాగా ప్రస్తుతం ఈ మ్యాటర్ పలు టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: