టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాతో యావరేజ్ విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. భారీ ఖర్చుతో, అత్యున్నత సాంకేతిక విలువలు, సెట్టింగులు, తారాగణం వంటి అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలో కథ, కథనాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో కొందరు ప్రేక్షకులు ఈ సినిమాపై పెదవి విరిచారు. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో తమన్నా, అనుష్క శెట్టి ప్రత్యేక పాత్రల్లో నటించడం జరిగింది. ఇకపోతే దీనితరువాత మెగాస్టార్ నటించబోయే 152వ సినిమా అధికారిక పూజా కార్యక్రమాలు ఇటీవల ఎంతో ఘనంగా జరిగాయి. 

వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించబోయే ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాయి. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ ని తీసుకోవాలని భావించినప్పటికీ ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడంతో మరొక సంగీత దర్శకుడిని ఎప్పటినుండో వెతుకుతోంది యూనిట్. మెగాస్టార్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అందుకోసం ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ని కూడా వెతికే పనిలో నిమగ్నమయ్యారట. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, 

ఈ సినిమాకు సంబంధించి నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక నేటితో పూర్తి అయిందని, అతి త్వరలో సినిమా క్యాస్టింగ్ విషయమై యూనిట్ సభ్యులు ఒక అఫీషియల్ అనౌన్సుమెంట్ కూడా ఇవ్వనున్నారని టాక్. ఇప్పటివరకు ఈ సినిమాలో ఫలానా హీరోయిన్స్  నటిస్తున్నారు అంటూ కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, ఎట్టకేలకు ఈ సినిమా పూర్తి వివరాలు వెల్లడికానుండడంతో ఈ వార్త నిజంగా మెగా ఫ్యాన్స్ కి పెద్ద పండుగ వార్తే అంటున్నారు. కాగా అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను రాబోయే సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారట....!!


మరింత సమాచారం తెలుసుకోండి: