సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయిన నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు గట్టిగా చేయాలనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కి సంబంధించిన విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులలో అంచనాలు విపరీతంగా పెంచుతున్నాయి. అయితే ఈ సినిమా అయిన వెంటనే మహేష్ బాబు సౌత్ ఇండియా డైరెక్టర్ తో చేయబోతున్నట్టు తెలుస్తుంది.అతనే కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.”కేజీయఫ్” సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హాట్ టాపిక్ గా నిలిచిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు “కేజీయఫ్ చాప్టర్ 2” తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు.


ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఓవరాల్ ఇండియా వైడ్ గా నెలకొన్నాయి.అలాంటి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకునితో మహేష్ లాంటి స్టార్ హీరో ఒక సినిమా అంటే ఆ అంచనాలే వేరే స్థాయిలో ఉన్నాయి.ప్రస్తుతానికి అయితే బజ్ లానే వినిపిస్తున్న ఈ విషయం ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో మహేష్ అభిమానులు టాలీవుడ్ ఇండస్ట్రీ డైరెక్టర్ లతో తప్ప మరొక డైరెక్టర్ తో అనగా కోలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన డైరెక్టర్లతో కానీ కన్నడ డైరెక్టర్లతో గాని సినిమాలు చేయవద్దు అంటూ సూచనలు చేస్తున్నారు.


ముఖ్యంగా నాని మరియు స్పైడర్ ఇలాంటి దారుణమైన డిజాస్టర్ అటువంటి దర్శకుల వల్ల వచ్చాయని..ప్రశాంత్ నిల్ తో సినిమా చేయవద్దని కొంతమంది మహేష్ అభిమానులు సోషల్ మీడియా లో గోల పెడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: