టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ అంటే చాలామంది నిర్మాతలు పక్కా ప్లానింగ్ తో సినిమాలు విడుదల చేస్తారు. ఈ క్రమంలో ఒక సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో మరొక సినిమా రిలీజ్ కాకుండా బిజినెస్ పాడవకుండా ముందు నుండే చర్చించుకుంటూ సినిమాలు మొదలుపెడతారు. ఇటువంటి తరుణంలో రాబోతున్న సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలలో రెండు ఫేవరెట్ సినిమాలుగా విడుదలవుతున్నాయి. ఒకటి అల్లు అర్జున్ సినిమా ‘అలా వైకుంఠపురం లో’ అయితే మరొకటి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమా.


అయితే ఈ రెండు సినిమాలు ఒకే రోజు అనగా జనవరి 12వ తారీకున సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ఇద్దరు హీరోలు పంతం పట్టి ప్రకటించడంతో ఇద్దరు హీరోలు తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇదే క్రమంలో ఇద్దరు హీరోల అభిమానులు తమ అభిమాన హీరో సినిమా ఒకే రోజున విడుదల అనే సరికి  రోషంతో ఎవరికి వారు మీరా మేమా అన్నట్టుగా ప్రవర్తించారు కానీ ఇప్పుడిప్పుడే ఇద్దరి హీరోల అభిమానులు ఒకే రోజున కానీ ఈ ఇద్దరి సినిమాలు వస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయా అని ఆలోచించడం మొదలు పెట్టారు.


ఒకవేళ నిజంగానే ఈ రెండు చిత్రాలు ఒకే రోజున విడుదల అయితే తప్పకుండా ఇద్దరికీ నష్టాలు తప్పవు అందువల్ల అభిమానులు సహా బయ్యర్లు కూడా భయపడుతున్నారు. దీంతో రిలీజ్ తేదీ విషయంలో ఒకరికి అనుకూలంగా మరొకరు కాంప్రమైజ్ అవ్వాలని మహేష్ మరియు బన్నీలు అనుకుంటున్నట్టు సమాచారం.ప్రస్తుతం షూటింగ్ లో బిజీ గా ఉన్న వీరు వీలు చూసుకొని తమ తమ నిర్మాతలు, చిత్ర యూనిట్లతో కలిసి ఒక మీటింగు ఏర్పాటు చేసి విడుదల తేదీల పట్ల ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోడానికి ఆలోచిస్తున్నట్టు సినీ వర్గాల నుంచి సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: