‘నా పేరు సూర్య’ సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో తీవ్ర నిరాశకు గురైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆ తర్వాత సినిమా చేయడానికి చాలా టైం తీసుకున్నారు. చాలా మంది డైరెక్టర్లు చెప్పిన కథలు విన్న అల్లు అర్జున్ చివరాకరికి గతంలో తనకు రెండు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పిన అలా వైకుంఠపురం లో సినిమా స్టోరీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ సినిమా షూటింగ్ లో పాల్గొని ప్రస్తుతం ఆ సినిమా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయిన నేపథ్యంలో పాటల చిత్రీకరణ మినహా షూటింగ్ మొత్తం అయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మెల్లగా స్టార్ట్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది.


ఇదే క్రమంలో సినిమాకి సంబంధించిన విడుదలైన రెండు పాటలు ప్రస్తుతం యూట్యూబ్ లో సెన్సేషనల్ క్రియేట్ చేసి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న నేపథ్యంలో చిల్డ్రన్స్ డే నాడు అభిమానులకు మరో గిఫ్ట్ ఇవ్వడానికి అల్లు అర్జున్ రెడీ అయినట్లు సమాచారం. అయితే చిల్డ్రన్స్ డే నాడు అనగా నవంబర్ 14వ తేదీ సినిమాకి సంబంధించిన సాంగ్ లేకపోతే టీజర్ గాని విడుదల చేయడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు వార్తలు వినబడుతున్నాయి.


ఈ క్రమంలో ఇప్పటికే సాంగ్స్ దుమ్ము దులుపుతున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల చేయాలని డైరెక్టర్ త్రివిక్రమ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా త్రివిక్రమ్ బన్ని కాంబినేషన్లో గతంలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో...ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న అల వైకుంఠ పురంబులో సినిమాతో హ్యాట్రిక్ కొట్టడం గ్యారెంటీ అని డిసైడ్ అయిపోతున్నారు అల్లు అర్జున్ అభిమానులు.



మరింత సమాచారం తెలుసుకోండి: