సినిమా ఫీల్డ్లో హిట్, ఫ్లాప్ అనేవి సహజం కాని కొందరికి మాత్రం ఇవి ముఖ్యం. ఎందుకంటే వరుసగా ఫ్లాప్లు ఉన్నాయంటే ముఖం చూపించే నాధుడే ఉండడు. అదే వరుసగా హిట్లు పడుతుంటే సినిమాలు చేయడానికి క్యూలో ఉంటారు. అందుకే సినిమా అనేది ఓ మాయా ప్రపంచం అన్నారు పెద్దలు. ఇకపోతే ఫ్లాప్ అనే వడదెబ్బ వల్ల ఎందరో హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్స్ కనుమరుగవుతున్నారు. తిరిగి ఇలాంటి వారు అవకాశాలు పొందాలంటే కొంచెం కష్టం.
ఏ ప్రోడ్యూసరో వీరిపై దయతలచి అవకాశం ఇవ్వాలి. ఇకపోతే విక్టరీ వెంకటేష్ , యువ సమ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ వెంకీమామ. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాని డిసెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ను త్వరలోనే అఫిషియల్గా ఎనౌన్స్ చేయనున్నారు. ఇదిలా ఉంటే… ఈ సినిమా తర్వాత వెంకీ తమిళ చిత్రం అసురన్ రీమేక్ లో నటించనున్న విషయం తెలిసిందే.
ఈ తమిళం మూవీలో ధనుష్, మంజు వారియర్ జంటగా నటించారు. ఇదే సినిమాను ఇప్పుడు తెలుగులో కలైపులి థాను, డి.సురేష్బాబు నిర్మించనున్నారు. అందుకు గానూ ఈ మూవీని అఫిషియల్ గా ఇటీవల ఎనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే.. తమిళంలో వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదని సమాచారం.
కాని అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, లై, పడి పడి లేచే మనసు చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి ఈ రీమేక్ ను తెరకెక్కించనున్నారని తాజా సమాచారం ప్రకారం తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మరి… ప్రచారంలో ఉన్న వార్తల పై వెంకీ కానీ, సురేష్ బాబు కానీ స్పందిస్తారేమో చూడాలంటున్నారు సినీ అభిమానులు..