50 సినిమాలకు పైగా నటించి ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకుని రాజేంద్రప్రసాద్ తరువాత కామెడీ సినిమాలకు హీరో అని ముద్ర వేయించుకున్న అల్లరి నరేశ్ పరిస్థితి అతడికి కూడ అర్ధంకాని విషయంగా మారిపోయింది. వరస పరాజయాలతో సతమతమైపోతున్న ఈ హీరో తనకు ఒక బ్రేక్ వస్తుందని మహేష్ తో కలిసి ‘మహర్షి’ లో నటించాడు. 

ఈమూవీలో నరేశ్ నటనకు మంచి ప్రశంసలు దక్కినా ‘మహర్షి’ మూవీ ఈ అల్లరోడి పరిస్థితిని మరింత దిగజార్చింది. ‘మహర్షి’ తరువాత నరేశ్ కు హీరో పాత్రలు రాకుండా చాల సినిమాలలో అతిథి పాత్రలో హీరోలకు అన్నయ్య పాత్రలు రావడం మొదలయ్యాయి అని టాక్. దీనితో హడలిపోయిన నరేశ్ తాను హీరో పాత్రను తప్ప ఇలా అతిథి పాత్రలు చేయనని స్పష్టంగా చెప్పడంతో అతడికి హీరో పాత్రలు దక్కలేదు సరికదా అతిథి పాత్రలు కూడ దూరం అయిపోయాయి.

అయితే ఇలాంటి పరిస్థితులలో నరేశ్ ను హీరోగా పెట్టుకుని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఒక కామెడీ మూవీని చాల వేగంగా నిర్మించింది. ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర తన ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ మూవీని ఇంచుమించు పూర్తి చేసారు అని తెలుస్తోంది. అయితే ఆ మూవీ విడుదల గురించి ఆలోచించకుండా అనీల్ సుంకర ప్రస్తుతం తన దృష్టి అంతా మహేష్ తో తాను చేస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ పై దృష్టి పెట్టడంతో 90 శాతం ఇప్పటికే పూర్తి అయిన నరేశ్ సినిమా ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ గురించి మళ్ళీ అనీల్ సుంకర ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల అయిన తరువాత మాత్రమే శ్రద్ధపట్టే సూచనలు ఉన్నాయి. దీనితో నరేశ్ మూవీ మళ్ళీ మొదలు అవ్వాలి అంటే ఫిబ్రవరి దాటి పోతుంది అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో హీరోగా లేటెస్ట్ గా నటించిన  ఒకేఒక్క సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తెలియక మరి ఏ సినిమాలు చేయాలని ప్రయత్నించినా మంచి నిర్మాణ సంస్థలు దర్శకులు దొరకక ఈ అల్లరోడు తన కెరియర్ లో ఎప్పుడు పడని కష్టాలు పడుతున్నాడు అంటూ ఇండస్ట్రీలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: