ప్రభాస్ కు బాహుబలి తరువాత మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.  ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా సరే బాలీవుడ్ ఆహ్వానిస్తోంది.  బ్రహ్మరధం పడుతున్నది.  అందుకు తాజా ఉదాహరణ సాహో.  ఈ సినిమా కథాపరంగా పెద్దగా ఏమిలేదు.  కథనాలు కూడా పెద్దగా ఏమి లేవు.  కేవలం యాక్షన్ తప్పించి మరేమి ఈ సినిమాలో మనకు కనిపించదు.  అందుకే సినిమా ఫెయిల్ అయ్యింది.  


తెలుగులోచాలా వరకు ఇబ్బందులు పడింది సినిమా.  చాలా నష్టం కూడా వచ్చింది.  డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు.  వీరిని ఆదుకోవడానికి దిల్ రాజుతో సినిమా చేసేందుకు ప్రభాస్ కమిట్ అయ్యిన సంగతి తెలిసిందే.  ఇదిలా ఉంటె, ప్రభాస్ సినిమా బాలీవుడ్ లో మాత్రం దూసుకుపోయింది.  బాలీవుడ్ ప్రేక్షకులు సాహో సినిమాను చూసి ఓహో అనేశారు.  


థియేటర్ల దగ్గర క్యూలు కట్టారు.  అటు బీహార్, ఒడిశా రాష్ట్రాల్లోనైతే చెప్పక్కర్లేదు.  వరదలు వచ్చి మునిగిపోతున్నా, ప్రభాస్ సినిమాను చూసి మెచ్చుకున్నారు. ప్రభాస్ నిజంగా సూపర్.. సినిమా చాల బాగుంది. యాక్షన్ పార్ట్ అదుర్స్ అంటూ క్లాప్స్ కొట్టారు.  ఇక చిత్ర దర్శకుడికి గుడి కడతామని కూడా చెప్పడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ జాన్ సినిమా చేస్తున్నారు.  ఇది ప్యూర్ లవ్ ఓరియెంటెడ్ సినిమా.  


పైగా 1980 నాటి కాలం కథగా తెరకెక్కుతోంది.  ప్రభాస్ ను వీరుడిగా బాహుబలి సినిమా ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులు ఆహ్వానించారు.  యాక్షన్ కు ఫిదా అయ్యారు.  ఇప్పుడు జాన్ సినిమాలోని లవ్ కు కూడా బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అవుతారా చూడాలి.  పక్కా రొమాంటిక్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక్క బాలీవుడ్ కు మాత్రమే కాదు.. టాలీవుడ్ కు కూడా చాలా అవసరం.  ఎందుకంటే.. టాలీవుడ్ లో ప్రబస్ కు బాహుబలి తరువాత హిట్ లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: