ప్రభాస్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘జాన్’ మూవీ తరువాత సురేంద్ర రెడ్డి పరుశు రామ్ చెప్పిన కథలలో ఏదో ఒక కథను ఎంచుకుని ఆ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు అని వస్తున్న వార్తల పై ప్రభాస్ పి ఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం ప్రభాస్ దృష్టి అంతా తాను నటిస్తున్న ‘జాన్’ మూవీ పై మాత్రమే ఉందని ప్రభాస్ అందరు అనుకుంటున్నట్లుగా ఎవరు చెపుతున్న కథలను వినడంలేదు అన్న క్లారిటీ ఇచ్చింది.

అంతేకాదు ప్రభాస్ తన దగ్గరకు వచ్చిన ఒక డైరెక్టర్ తో కాసేపు మాట్లాడి ఒక టీ కలిసి తాగితే వారి సినిమాలలో ప్రభాస్ నటిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చేస్తున్నాయి అంటూ ఆవార్తలను ప్రభాస్ పి ఆర్ టీమ్ ఖండిస్తోంది. దీనితో ప్రభాస్ లేటెస్ట్ మూవీ విషయాల పై ఇప్పటి వరకు మీడియాలో హడావిడి చేస్తున్న వార్తలు అన్నీ గాలి వార్తలు అని తేలిపోయాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ‘సాహో’ ఇచ్చిన ఫలితంతో ప్రభాస్ మరో ప్రయోగానికి ఇష్టడటం లేదనీ అందువల్ల ‘జాన్’ పూర్తి అయిన తరువాత అవసరం అనుకుంటే గ్యాప్ తీసుకుని కొరటాల కోసం వేచి చూడాలి అన్న ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కొరటాల చిరంజీవితో తీస్తున్న మూవీ తరువాత వెంటనే చరణ్
తో మరొక మూవీ చేయాలనే ఎగ్రిమెంట్ ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. 

దీనితో ప్రభాస్ కొరటాల పై ఆశలు పెంచుకున్నా మరో ఏడాదిన్నర వరకు ప్రభాస్ కు కొరటాల అందుబాటులో ఉండడు అన్న సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో తనతో సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్న బాలీవుడ్ డైరెక్టర్స్ ను అలాగే కొంతమంది తెలుగు డైరెక్టర్స్ ను నమ్మలేక తాను కోరుకుంటున్న కొరటాల
ఎప్పుడు అందుబాటులో వస్తాడో తెలియక ఒక విచిత్రమైన కన్ఫ్యూజన్ లో ప్రభాస్ ఉన్నాడు అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: