సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్ పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన ఈరోజు ఉదయం జరిగింది. హైదరాబాద్ శివారులోని శంషాబాద్ పెద్ద గోల్కొండ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా, పడిందని సమాచారం. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌కు ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో రాజశేఖర్ కారు మూడు పల్టీలు కొట్టింది. ఆ సమయంలో కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో రాజశేఖర్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.

 


సంఘటన జరిగిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. TS 07 FZ 1234 అనే కారులో రాజశేఖర్ తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్టు సమాచారం. రాజశేఖర్ కి, కారులోని మరోవ్యక్తికి గాయాలు అయ్యాయి. ఆ సమయంలో ఆయన బెంజ్ కారులో ప్రయాణిస్తున్నారు. కారు ప్రమాదం జరిగిన సమయం ఈరోజు తెల్లవారుఝామున 2:30 గంటలకు జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచరాణ చేపట్టారు. ఓవర్ స్పీడ్ కారణంగా ఈ కారుపై మూడు ట్రాఫిక్ చాలానాలు ఉన్నాయని పోలీసులు అంటున్నారు.

 


మంచు కూడా ఎక్కువగా ఉండటం, అతివేగం కారణంగా ఎదుట ఉన్న డివైడర్ ను గుర్తించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. అతివేగమా.. మంచు కారణంగా ప్రమాదం జరిగిందా అనేది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. ఈ ఘటనపై స్పందించేందుకు ఆయన కుటుంబసభ్యులు అందుబాటులోకి రాలేదు.  ప్రస్తుతం రాజశేఖర్ తన ఇంట్లోనే ప్రైవేట్ డాక్టర్ తో చికిత్స తీసుకుంటున్నాడని సమాచారం. రాజశేఖర్ కు ఎటువంటి ప్రాణాపాయం లేదని అంటున్నారు. గతంలో కూడా ఓసారి ఆయన కారు ప్రమాదానికి గురయ్యారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: