ఈ మద్య సిని పరిశ్రమలో ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.  అది పాజిటీవ్ అయినా..నెగిటీవ్ అయినా ఆ వార్తలు వైరల్ కావడంతో ప్రేక్షకులు కన్ఫ్యూజ్ లో పడిపోతున్నారు.  తాజాగా ఇప్పుడు ఇలాంటి వార్తే బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. దాంతో నిజంగా ఆ ఇద్దరు అలా కొట్టుకున్నారా? అని అశ్చర్యపోతున్నారు.  ఇంతకీ జరిగిన విషయం ఏంటో తెలుసా..బాలీవుడ్ హీరో యాక్షన్ అక్షయ్ కుమార్ ప్రముఖ స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ రోహిత్ శెట్టి కొట్టుకున్నారని..వారి ఇద్దరి మద్య అభిప్రాయ భేదాలు వచ్చాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


ప్రస్తుతం బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీకి  రోహిత్‌శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. రోహిత్‌శెట్టి, కరణ్ జొహార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  తాజాగా హీరో, డైరెక్టర్ మద్య పెద్ద గొడవ జరిగిందని..కొట్టుకున్నారని ‘బాలీవుడ్ హంగామా’ అనే వెబ్‌సైట్ కథనం రాసింది. వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు కరణ్ జొహార్ ప్రయత్నిస్తున్నట్టు బ్రేకింగ్ న్యూస్ పెట్టి మరీ వార్త రాసింది. అంతే ఆ న్యూస్, వీడియో కాస్త ఒక్కసారిగా వైరల్ అయ్యింది.  ఈ వార్త విపరీతంగా వైరల్ అయి చివరికి అక్షయ్ కుమార్‌ వద్దకు చేరింది. దీంతో ఆ వార్త రాసిన వెబ్‌సైట్‌కు దిమ్మదిరిగే రిప్లై ఇచ్చాడు. కత్రినా కైఫ్, రోహిత్‌శెట్టిలతో కలిసి ఓ చక్కని డ్రామాను సృష్టించి అక్షయ్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. 

అంతే కాదు వార్తను కత్రినా తొలుత తన స్మార్ట్‌ఫోన్‌లో చూపించింది. అనంతరం.. ‘‘ఈ వార్త ప్రకారం వారిద్దరూ కొట్టుకోవాలిగా.. చూడండి, నిజంగానే కొట్టుకుంటున్నారు’’ అని చూపించింది.  దాంతో తప్పుడు వార్త ప్రచురించిన వెబ్‌సైట్‌పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. వాస్తవానికి ‘సూర్యవంశీ’ సెట్‌లోనే దీనిని షూట్ చేసి పోస్టు చేశారు.ఈ వీడియోలో ఓ వైపు తలుపు తోసుకుని రోహిత్ శెట్టి, మరో తలుపు తోసుకుని అక్షయ్ కుమార్ దూసుకొచ్చారు. ఒకరినొకరు దూషించుకొని..కొట్టుకొని అలసిపోయిన అక్షయ్, రోహిత్‌లు ఇద్దరూ కిందపడిపోయారు.  ఏది ఏమైనా ఇలాంటి న్యూస్ తమకు అనుకూలంగా మార్చుకొని లేపిపోని అపోహలు కల్పించడంపో వెబ్ సైట్లపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: