సోషల్ మీడియాలో సెలబ్రెటీలపై  విచిత్ర మైన వార్తలు వస్తూ ఉంటాయన్న  విషయం అందరికి తెలిసిందే. సెలెబ్రిటీ లపై  ఏదో ఒక వార్త క్రియేట్ చేసి హల్చల్ చేస్తుంటారు. ఇలాంటి ఘటనే జరిగింది. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్  సూర్య వంశి అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అక్షయ్ కుమార్ సరసన కత్రినా కైఫ్ నటిస్తుండగ... రోహిత్ శెట్టి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కరణ్ జోహార్, రోహిత్ శెట్టి  ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో దర్శకుడు రోహిత్ శెట్టి, అక్షయ్ కుమార్  మధ్య  షూటింగ్ లో గొడవ జరిగిందని ఇద్దరు కోరుకున్నారని... కరణ్ జోహార్ వీరిద్దరి మధ్య గొడవ సద్దుమణిగించేందుకు  ప్రయత్నిస్తున్నారంటూ బాలీవుడ్ హంగామా అనే వెబ్సైట్ కథనం రాసింది . బ్రేకింగ్ న్యూస్ పెట్టి మరి ఈ వార్త రాసింది వెబ్సైటు. 

 

 

 ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్  అయిపోయింది. ఇక చివరికి అక్షయ్ కుమార్  వద్దకు చేరింది ఈ వార్త. దీంతో ఈ వార్త రాసిన వెబ్సైట్ కి గట్టి రిప్లై ఇచ్చారు అక్షయ్ కుమార్ . కత్రినా కైఫ్, రోహిత్ శెట్టి తో కలిసి ఓ చక్కని డ్రామా షూట్ చేసి   అక్షయ్ కుమార్ ట్విట్టర్లో పోస్ట్ చేసి  ఆ వార్త రాసిన వెబ్సైట్ కి షాక్ ఇచ్చాడు. అయితే అక్షయ్  కుమార్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడమే  కాదు తప్పుడు వార్తలను ప్రచురించిన వెబ్ సైట్ పై దుమ్మెత్తి పోస్తున్నారు ప్రజలు. అయితే ఈ వీడియోలో హీరోయిన్ కత్రినా కైఫ్ తన మొబైల్ లో ఈ వార్తను  చూపిస్తూ ఈ వార్త ప్రకారం దర్శకుడు రోహిత్ శెట్టి హీరో అక్షయ్ కుమార్ కొట్టుకోవాలి కదా ఇప్పుడు చూడండి అంటూ చెబుతుంది..

 

 

 

 ఆ తర్వాత ఓ వైపు నుంది రోహిత్ శెట్టి...  మరో వైపు నుంచి అక్షయ్ కుమార్ దూసుకొచ్చారు. ఇక వచ్చీ రావడమే ఇద్దరూ ఒకరిపై పడి కొట్టుకుంటారు. ఆ తర్వాత పక్కనే ఉన్న చిత్ర యూనిట్ సభ్యులందరూ వారిని విడిపించే  ప్రయత్నం చేస్తారు. కొట్టుకొని అలసిపోయిన అక్షయ్ కుమార్ దర్శకుడు పడిపోతారు.సూర్య వంశీ  సెట్లోనే ఈ వీడియోను షూట్ చేసి పోస్ట్ చేశారు అక్షయ్ కుమార్. అయితే తనపై వచ్చిన వార్తను అక్షయ్ కుమార్  ఖండించిన తీరుపై  అందరూ ఆశ్చర్యపడ్డారు. అక్షయ్ కుమార్ పై తెగ  ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: