టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు. ఇప్పటికే దాదాపుగా పూర్తి కావచ్చిన ఈ సినిమా తాజా షెడ్యూల్ కేరళలో జరుగుతోంది. సినిమాలోని ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారని, దీని తరువాత హైదరాబాద్ వచ్చాక మహేష్, రష్మీకల పై ఒక డ్యూయెట్ ని చిత్రీకరించిన అనంతరం సినిమా పూర్తి అవుతుందని తెలుస్తోంది. ఇకపోతే సీనియర్ నటి విజయశాంతి చాలా రోజుల తరువాత ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తుండగా మరొక నటి సంగీత మరియు కమెడియన్ బండ్ల గణేష్ కూడా ఈ సినిమా ద్వారా కొంత గ్యాప్ తరువాత నటిస్తున్నారు. 

అన్ని రకాల కమర్షియల్ హంగులతో పక్కా ఎంటర్టైనర్ గా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాక్. రెండు వరుస సక్సెస్ ల తరువాత సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సినిమా కావడం, అలానే దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్ లో కూడా అన్ని కూడా విజయాలే ఉండడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. అలానే ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా ఈ సినిమా దుమ్ము రేపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓవర్సీస్ హక్కులను గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ వారు భారీ ధరకు దక్కించుకోగా, ఈ సినిమా గుంటూరు జిల్లా హక్కులను ఎన్టీఆర్ తో కంత్రి, శక్తి సినిమాలు తీసిన మెహర్ రమేష్ దక్కించుకున్నట్లు నేడు ఫిలిం నగర్ వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి. 

మహేష్ బాబు కుటుంబంతో మెహర్ రమేష్ కు మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఆ చనువుతోనే ఈ సినిమా హక్కులు ఆయనకు దక్కాయని, అలానే రమేష్ ఈ హక్కులను భారీ రేట్ ఇచ్చి దక్కించుకున్నారని అంటున్నారు. అలానే మిగతా ప్రాంతాల హక్కులకు కూడా కళ్ళు చెదిరే రేంజ్ లో బిజినెస్ జరుగుతోందట. మరి ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ రేంజ్ లో అదరగొట్టిన ఈ సినిమా, రేపు రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: