రాజశేఖర్ కు నిన్న అర్థరాత్రి కారు ప్రమాదం జరిగింది అని వచ్చిన వార్తలు ఈరోజు ఉదయం నుండి వైరల్ కావడంతో అసలు రాజశేఖర్ ఎలా ఉన్నాడు అంటూ అనేకమంది
ఇండస్ట్రీ ప్రముఖులు వాస్తవ విషయాలను తెలుసుకోవడానికి రాజశేఖర్
జీవిత దంపతులుకు ఈరోజు ఉదయం నుండి ఫాన్స్ చేస్తున్నట్లు సమాచారం.
దీనితో రాజశేఖర్ తనకు జరిగిన ప్రమాదం గురించి ఒక స్పష్టమైన క్లారిటీ తనకు ఫాన్స్ చేసిన వారికి ఇవ్వడమే కాకుండా మీడియాకు కూడ ఆ క్లారిటీ ఇస్తూ ఒక ప్రకటన చేసాడు. తాను క్షేమంగా ఉన్నానని తనకు భగవంతుడు దయవల్ల ఎటువంటి గాయాలు కాలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.
నిన్న రాత్రి రామోజీ ఫిలిం సిటీ నుండి తన ఇంటికి తిరిగి వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డులోని అప్పా జంక్షన్ వద్ద తన కారు ప్రమాదానికి గురైందని అయితే అప్పుడు ఆ కారులో తను ఒక్కడినే ఉన్నానని తన కారు ప్రమాదం జరగడంతో ఎదురుగా వస్తున్న కారులోని వారు తన కారు వద్ద ఆగినప్పుడు తనను గుర్తించడంతో తన కారు విన్
షీల్డ్ లోంచి తనను బయటకు లాగి తనను రక్షించిన విషయాన్ని తెలియ చేసాడు. ఆ షాక్ లో తాను వారి వద్ద
ఫోన్ తీసుకుని ముందుగా పోలీసులకు ఆ తరువాత తన కుటుంబ సభ్యులకు తెలియ చేసిన విషయాన్ని వివరించాడు.
ఈలోపున
జీవిత మరొక కారులో వచ్చి తనను పికప్ చేసుకోవడంతో ఈ ప్రమాదం నుండి ఎటువంటి గాయాలు లేకుండా తాను బయటపడిన విషయాల పై క్లారిటీ ఇచ్చాడు. రాజశేఖర్ ఇలా ప్రమాదానికి గురవ్వడం ఈమధ్య కాలంలో ఇది వరుసగా మూడోసారి. గతంలో ఎయిర్ పోర్ట్ కు వెళ్తూ పీవీ నరసింహారావు ఎక్స్
ప్రెస్ హైవేపై రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ‘కల్కి’
సినిమా షూటింగ్ టైమ్ లో కూడా రాజశేఖర్ కు
యాక్సిడెంట్ జరిగింది. ఏది ఏమైనా ఒక పెను ప్రమాదం నుండి రాజశేఖర్ క్షేమంగా బయట పడటంతో కుటుంబ సభ్యులు మరియు
టాలీవుడ్ ఇండస్ట్రీ ఊప్పిరి పీల్చుకుంది..