తన పాటలతో తన మ్యూజిక్ తో తన మాస్ బీట్ లతో సంగీత ప్రియులను ఎంతగానో అలరించిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కి సౌత్ లో మంచి మార్కెట్ ఉంది. అయితే ఇటీవల రాను రాను దేవిశ్రీప్రసాద్ మార్కెట్ డౌన్ అవుతూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఒకానొక సమయంలో దేవీశ్రీ ప్రసాద్ అంటే పడిచచ్చే డైరెక్టర్ లే ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ ని పక్కన పెట్టి సినిమాలు చేస్తున్నారు. క్లియర్ కట్ గా విషయంలోకి వెళ్తే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అప్పట్లో సన్నాఫ్ సత్యమూర్తి వరకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమాలు చాలా వరకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అయితే ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమా తర్వాత దేవి శ్రీ ప్రసాద్ తో త్రివిక్రమ్ సినిమాలు చేయడం ఆపేసినట్లు తెలుస్తోంది.


ఇదే తరుణంలో కొరటాల శివ కూడా చిరంజీవి 152 చిత్రానికి దేవిశ్రీకి అవకాశం ఇవ్వలేదు. ఇలా వరుసగా దేవిశ్రీ చేతుల్లో నుంచి స్టార్ హీరోల చిత్రాలు చేజారుతున్నాయి. తాజాగా మరో దర్శకుడు కూడా దేవిశ్రీ ప్రసాద్ కు హ్యాండిచ్చాడు. మాస్ చిత్రాల దర్శకుడు హరి రీసెంట్ గా హీరో సూర్యతో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ఇమాన్ సంగీత దర్శకుడు.


దేవిశ్రీ, హరి కాంబినేషన్ లో ఆరు, యముడు, సింగం లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. గతంలో హరి- సూర్య కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలకు దేవిశ్రీ సంగీతం అందించడం తో వారి కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగు సినిమాకు వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని ఇప్పుడు హరి తీసుకోవడంతో ఈ విషయం ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. దీనంతటికీ కారణం దేవిశ్రీప్రసాద్ మార్కెట్ రోజు రోజుకి అవుతుందని ఇందువల్లనే డైరెక్టర్లు దేవి శ్రీ ప్రసాద్ ని పక్కన పెడుతున్నారని కొంతమంది సినిమా విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: