అనిల్ రావిపూడి దర్శకత్వం లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు  నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు మరియు వార్తలు సినిమాపై అంచనాలు పెంచే చేస్తుండగా మరో పక్క సినిమాలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి నటిస్తున్న నేపథ్యంలో సినిమాపై ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పటిదాకా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు పోస్టర్లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న నేపథ్యంలో మరో పక్క మహేష్ బాబు నటిస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీసు దగ్గర సంచలనాలు సృష్టిస్తున్న క్రమంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్‌లో జరుగుతోంది.


సినిమా రైట్స్ కోసం బయ్యర్లు పోటాపోటీగా ముందుకు వస్తున్నారు. అలాంటి సినిమా గుంటూరు రైట్స్ ని మెహర్ రమేష్ తీసుకోవటంతో ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. అయితే ఈ రైట్స్ ని నమ్రత దగ్గరుండి ఇప్పించిందని సమాచారం. తమ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్న మెహర్ రమేష్ కు సాయిం చేయటానికి ఆ రైట్స్ ఇప్పించిందని వినికిడి. ఆ రైట్స్ తో ఇప్పుడు మెహర్ రమేష్ జాక్ పాట్ కొడుతున్నాడని అంటున్నారు.


థియోటర్ అడ్వాన్స్ ల రూపంలోనే ఆయన పెట్టుబడి వచ్చేసిందని, మిగతాదంతా లాభమే అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది . ఇదే క్రమంలో ఓవర్సీస్ హక్కులు గ్రేట్ ఇండియా ఫిలింస్ వారు దక్కించుకున్నట్లు సమాచారం అందుకున్న నైజాం హక్కులకోసం ఇండస్ట్రీకి చెందిన ఓ బడా నిర్మాత దక్కించుకోవటానికి భారీ రేట్ పెట్టడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వినబడుతున్న టాక్. జనవరి 12వ తారీకున సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: