టాలీవుడ్ లో ఈ మద్య కొత్త హీరోయిన్ల జోరు బాగా పెరిగిపోయింది.
కాజల్,నయనతార,త్రిష,
అనుష్క జోరు తగ్గిన తర్వాత రకూల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నా,రెజీనా ఎంటర్ అయ్యారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో సాయిపల్లవి,అనుపమా పరమేశ్వరన్,కీర్తి
సురేష్, మెహ్రీన్ లాంటి హీరోయిన్లు తమ సత్తా చాటుతున్నారు. ఇక మలయాళంలో రూపొందిన `ప్రేమమ్` సినిమాతో దక్షిణాదిలో మంచి గుర్తింపు సంపాదించుకుంది అనుపమా పరమేశ్వరన్. ఈ మూవీని తెలుగులో అక్కినేని
నాగ చైతన్య నటించారు. ఈ
రీమేక్ మూవీతో తెలుగువారినీ పలకరించింది.
ఆ తర్వాత తెలుగులో పలువురు యంగ్ హీరోల సరసన నటించింది. అయితే ఆ పాత్రలన్నీ గ్లామర్కు దూరంగా పక్కంటి
అమ్మాయి తరహా పాత్రలే. మొదటి నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తున్న
అనుపమా పరమేశ్వరన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు మంచి ట్రెడిషినల్ పాత్రలే సరిపోతాయని, గ్లామరస్ పాత్రలు తనకు సూట్ కావని తాజాగా అనుపమ అభిప్రాయపడింది. ఇక గ్లామర్ పేరిట పొట్టి పొట్టి డ్రెస్సులు, బికినీలు వేసుకొనే ఛండాలం పని తాను ఎప్పటికీ చేయబోనని అన్నారు. సాంప్రదాయదుస్తుల్లో కూడా అందంగా కనిపించవచ్చు.
నేను సహజంగా కనిపించడానికే ఇష్టపడతా. ఇప్పటి వరకు కనిపించి హీరోయిన్లు అందరూ గ్లామర్ కే ప్రాధాన్యత ఇవ్వలేదు..తమ నటనతో కూడా మెప్పించారు. షూటింగ్ ఉంటేనే నేను
మేకప్ వేసుకుంటా. లేకపోతే సాధారణ అమ్మాయిలాగానే ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతాను. గ్లామర్ గా కనిపిస్తే కొంత కాలం వరకు మాత్రమే ఆదరిస్తారని..నటనతో మెప్పిస్తే ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ఉండిపోతామని అంటుంది ఈ మాలీవుడ్ భామ.ఇటీవల బెల్లంకొండ
శ్రీనివాస్ సరసన ‘రాక్షసన్’ రీమేక్లో మంచి పారితోషికంతో అవకాశం రావడంతో రెండో ఆలోచన లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఈ
సినిమా మంచి విజయం అందుకుంది.