అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ తో వస్తున్న మూడవ
సినిమా అలా వైకుంఠపురములో. ఇప్పటికే ఈ
సినిమా నుంచి విడుదలయిన 'సామజవరగమనా, రాములో రాములా..' అనే పాటలు ప్రేక్షకులకు అమితంగా నచ్చాయి. క్లాసికల్ మ్యూజిక్కి వెస్ట్రన్ టచ్ ఇచ్చి ఎస్.ఎస్. థమన్ స్వరపరచిన 'సామజవరగమనా' సాంగ్ ప్రేక్షకుల మనసులని దోచేసింది. రాములో రాములా పాట కూడా
యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. సామజవరగమనా పాట అయితే 7లక్షల లైక్స్ తో
యూట్యూబ్ రికార్డులను తిరగరాసింది.
కేవలం ఈ రెండు పాటలతోనే పిచ్చెకించిన ఈ చిత్ర బృందం మరొక సాంగ్ ను విడుదల చేయడానికి సిద్దమవుతుంది. అధికారికంగా ఈ చిత్రంలోని మూడవ పాటకు సంబందించిన వివరాలు ఈ రోజు సాయంత్రం 4:05 నిమిషాలకు తెలియచేస్తాం అంటూ నిర్మాతలు
ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
చెప్పిన ప్రకారమే.. కచ్చితంగా 4:05 నిమిషాలకి 3వ పాటకు సంబంధించిన వివరాలను తెలియచేసారు. ఆ పోస్ట్ ప్రకారం... 2 చిన్న సర్ప్రైజులు ఈ పాటలో ఉంటాయంట. ఎందుకంటే ఈ 3వ పాటలో ప్రత్యేక అతిధులు పాల్గొన్నారంట. బాలల దినోత్సవం సందర్భంగా #ఓ మై గాడ్ డాడీ అనే సాంగ్ టీజర్ ని రేపు ఉదయం 10:00 గంటలకు విడుదల చేయనున్నట్లు చెప్పారు. అయితే బాలల దినోత్సవం సందర్భంగా ఈ టీజర్ ని విడుదల చేస్తున్నారు కాబట్టి అల్లు అర్జున్ కుమారుడైన అల్లు అయాన్, కూతురైన అల్లు అర్హ ఈ సాంగ్ టీజర్ లో కనిపించనున్నట్లు సమాచారం.
ఇంతకు ముందుకు వచ్చిన పాటల లాగా 3వ పాట హిట్ అవుతుందో లేదో చుడాలిక. కాగా, ఈ చిత్రంలో
పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా,
సుశాంత్, నివేదా పేతురాజ్, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు పదేళ్ల విరామం తర్వాత సీనియర్ నటి టబు కూడా ఈ చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నారు. వచ్చే ఏడాది
జనవరి 12న ఈ
సినిమా విడుదల కాబోతోంది.
అల్లు అర్జున్ కి గారంటీ గా ఈ
సినిమా ఓ మంచి కం బ్యాక్ అంటున్నారు అభిమానాలు.