సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా తెరకెక్కుతోంది. మహేశ్ బాబుకు జోడీగా రష్మిక మందన్న ఈ సినిమాలో నటిస్తోంది. దిల్ రాజు అనిల్ సుంకర్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం 2020 సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతుంది. సరిలేరు నీకెవ్వరు సినిమా హిందీ డిజిటల్, డబ్బింగ్ బిజినెస్ ఇప్పటికే పూర్తయింది. 
 
కొన్ని నెలల క్రితం బాలీవుడ్ మార్కెట్ లో టాలీవుడ్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. కానీ హిందీ మార్కెట్ డౌన్ కావడంతో భారీ మొత్తాలకు తెలుగు సినిమాలు అమ్ముడుపోవడం లేదు. టాలీవుడ్ లోని కొంతమంది హీరోల సినిమాలు కేవలం హిందీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ మీద మాత్రమే కోట్ల రూపాయలు సంపాదించేవి. కొందరు నిర్మాతలు హిందీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలను తీసేవారు. 
 
ప్రస్తుతం బాలీవుడ్ మార్కెట్ లో స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే అంతో ఇంతో డిమాండ్ ఉంది. మిడిల్ రేంజ్ హీరోల సినిమాలను, చిన్న సినిమాలను బాలీవుడ్ మార్కెట్ లో ఎవరూ పట్టించుకోవటం లేదు. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కించిన మహర్షి సినిమా బాలీవుడ్ హక్కులు 20 కోట్ల రూపాయలకు అమ్ముడవగా సరిలేరు నీకెవ్వరు సినిమా బాలీవుడ్ హక్కులు మాత్రం 15 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. 
 
భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న మహేష్ బాబు సినిమాల రైట్స్ ఇంత తక్కువ మొత్తానికి అమ్ముడయ్యాంటే హిందీ మార్కెట్ ఎంతగా డౌన్ అయిందో అర్థమవుతుంది. టాలీవుడ్ లోని సినిమాలను బాలీవుడ్ బయ్యర్లు కొనడం ఆపేయడంతో హిందీ మార్కెట్ ను బేస్ చేసుకొని నిర్మిస్తున్న సినిమాలు ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: