ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్ తో కొనసాగుతున్న హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ప్రస్తుతానికి ఆమె చేతిలో తెలుగు సినిమాలేవీ లేనప్పటికీ తమిళంలో ఆమె శంకర్, రజినీకాంత్ భారతీయుడు 2, మరియు శివకార్తికేయన్ సరసన ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఇటీవల ఆమె నటించిన తాజా హిందీ సినిమా మర్జావన్ కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ దిశగా ముందుకు సాగుతోంది. ఇకపోతే కొన్నాళ్ల క్రితం నాగార్జున సరసన మన్మధుడు 2లో నటించిన ఈ ముద్దుగుమ్మ, ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. 

అయితే ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఆ సినిమా తరువాత రకుల్ కు తెలుగులో అవకాశాలు లేకుండాపోయాయి. ఇక నేడు ఒక ఇంటర్వ్యూ లో రకుల్ మాట్లాడుతూ, కొన్నాళ్ల క్రితం ప్రభాస్, తాప్సి, కాజల్ ల కాంబినేషన్లో వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో తొలుత హీరోయిన్ గా ఎంపికయింది తానే అంటూ ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. అసలు మ్యాటర్ ఏంటంటే, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా విషయమై నిర్మాత దిల్ రాజు, దర్శకుడు దశరధ్ తనను అప్రోచ్ అవడం, అలానే తాను కూడా సినిమాకు సైన్ చేయడం జరిగిందట. అంతేకాక అప్పట్లో నాలుగురోజుల పాటు ఆ సినిమా షూటింగ్ చేసిన తరువాత హఠాత్తుగా తన మనసు మార్చుకుని మీ సినిమాలో నేను యాక్ట్ చేయలేనని చెప్పిందట రకుల్. 

అయితే దానికి ఒక ముఖ్య కారణం ఉందట అదేమిటంటే, అప్పట్లో తాను మిస్ ఇండియా పోటీల కోసం సిద్ధం అవుతున్నానని, అందులో భాగంగా ఒకవేళ సినిమాల్లో యాక్ట్ చేస్తే అది తాను చేస్తున్న ప్రయత్నానికి అడ్డంకిగా మారే అవకాశం ఉందని భావించి వదులుకుందట. అది మాత్రమే కాక, అప్పట్లో తనకు తెలుగు సినిమాల మీద పెద్దగా అవగాహన లేదని, ఒకవేళ తనకు తెలుగుపై అప్పట్లో పట్టు ఉండి ఉంటె, తప్పనిసరిగా డార్లింగ్ ప్రభాస్ సరసన వచ్చిన ఛాన్స్ ని వదులుకునేదానిని కాదని ఒకింత బాధపడుతోంది ఈ భామ. కాగా ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుని ప్రభాస్, కాజల్, తాప్సి లకు కెరీర్ పరంగా మంచి పేరు తెచ్చిపెట్టింది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: