తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక స్ధానాన్ని సంపాదించుకున్నాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఎంతో అద్భుత‌మైన న‌ట‌న‌తో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఒక వెలుగు వెలిగి  ఆ తరువాత ప్రజాసేవ మీద ఉన్న అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చారు.  ఒక రాజకీయ పార్టీని ప్రారంభించి జయాపజయాలతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రశ్నిస్తున్నాడు. త‌న పార్టీ యొక్క ఎజెండా ప్ర‌శ్నించ‌డ‌మే అని ప్ర‌శ్నించ‌డానికి పార్టీ పెట్టారు ప‌వ‌న్‌. కాగా రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఇకమీదట సినిమాలు చేయనని, చివరి శ్వాస వరకు ప్రజాసేవ చేస్తానని అధికారికంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. కానీ ఈ విషయంలో ఆందోళన చెందిన అభిమానులు, కొందరు సన్నిహితుల కోరిక మేరకు పవన్ మళ్ళీ సినిమాలు చేయడానికి ఒప్పుకున్నార‌ని సమాచారం.

కాగా పవన్ విషయంలో కొందరు నిర్మాతలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. వారెవరో కాదు… దిల్ రాజు మరియు బోనీ కపూర్… అయితే పవన్ చేయబోయే సినిమా పింక్ రీమేక్ అని, ఆ చిత్రాన్ని తామే నిర్మిస్తున్నామని ఆ ఇద్దరు నిర్మాతలు కూడా అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు పవన్ ప్రవర్తన చూసి బాధపడుతున్నారు. తనని అడగకుండా సినిమాని ఎలా ప్రకటిస్తారని పవన్ ఇదివరకే ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. అయితే పవన్ మళ్ళీ సినిమా చేస్తాడో లేదో అనేది ఇప్పటికి ఒక స్పష్టత లేదు. కాకపోతే పవన్ సినిమా చేయకపోతే ఈ ఇద్దరు నిర్మాతల పరిస్థితి ఏంటో అనేది అర్థం కానీ విషయంలా మారిపోయింది.

మ‌రి ప‌వ‌న్ ఆ నిర్మాత‌ల‌ను ఆదుకుంటాడా. తను ఫ్యాన్స్‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం సినిమాల్లో చేస్తాడా లేదా అనేది వేచి చూడాలి.  ఇక‌పోతే ఒక రాజ‌కీయ నాయకుడుగా ఉన్న ఆయ‌న ఎంచుకునే క‌థ‌లు కూడా దాదాపుగా అన్నీ సందేశాత్మ‌కంగా ఉంటాయ‌ని కొంద‌రు భావిస్తున్నారు. మ‌రి ప‌వ‌న్ మాత్రం దేని పైన ఇంత వ‌ర‌కు స్పందించ‌లేదు. ఆయ‌న రాబోయే చిత్రాలు ఎలా ఉండ‌బోతున్నాయి. క‌థ‌ల ఎంపిక అనేది ఎలా ఉంటుంది ఏమిటి అన్నది మాత్రం ఒక క్లారిటీకి రాలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: