ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉంటుంటాయి. అది డైరెక్టర్-హీరోస్, డైరెక్టర్-హీరోయిన్స్, డైరెక్టర్-మ్యూజిక్ డైరెక్టర్స్..ఇలా అనమాట. అయితే ఇక్కడ కొన్ని కాంబినేషన్స్ నుంచి అద్భుతాలు పుడతాయి. స్వరమాంత్రికుడు ఇళయరాజాతో బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్ గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ముచ్చటించుకుంటారు. తాజా సమాచారం ప్రకారం క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ- మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా కాంబినేషన్ రిపీట్ త్వరలో కాబోతోందని లేటెస్ట్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో హల్‌చల్ చేస్తోంది. 

గతంలో 1998 లో అంతఃపురం సినిమాకి కృష్ణ వంశీ- ఇళయరాజా కలిసి పనిచేసిన మరోసారి తాజాగా రూపొందనున్న క్రేజీ ప్రాజెక్ట్ కోసం కలుస్తున్నారట. ప్రస్తుతం కృష్ణవంశీ 'రాజ మార్తాండ' అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరాఠా సూపర్ హిట్ నటసామ్రాట్ సినిమాకి ఈ సినిమా అఫీషియల్ రీమేక్ గా రూపొందనుంది.  పదవీ విరమణ పొందిన ఒక థియేటర్ ఆర్టిస్టు తన గతాన్ని మర్చిపోవడానికి ఏం చేశాడన్నదే ఈ సినిమా కథ. మరపురాని కష్టాల్ని మర్చిపోయేందుకు కళాకారుడు ఎలాంటి వేదనకు గురయ్యాడు అన్నది చూపిస్తూ ఆద్యంతం ఎమోషనల్ గా సాగే సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇందులో మరాఠా ఫేమస్ నటి మేధా మంజ్రేకర్ చేసిన పాత్రలో రమ్యకృష్ణ నటిస్తారని ఇంతక ముందే అనౌన్స్ చేశారు. అలాగే ది గ్రేట్ పెర్ఫామర్ నానా పటేకర్ పోషించిన పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. అభిషేక్ జాకర్- మధు కలిపు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

గతంలో ఇళయరాజా సంగీతం అందించిన 'అంతఃపురం' మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమాలో పాటలు.. రీరికార్డింగ్ ప్రతిదీ హైలైట్. అందుకే ఇంత గ్యాప్ వచ్చినా కృష్ణ వంశీ తాజా సినిమా కోసం మ్యాస్ట్రోని ఏరికోరి బరిలో దించుతున్నారట. దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత ఈ కాంబినేషన్ రిపీటవుతోంది. ఇక కృష్ణవంశీ- ప్రకాష్ రాజ్ కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. అంతఃపురం సినిమాకి ఆ ఇద్దరూ కలిసి పని చేశారు. ఇప్పుడు మరోసారి అరుదైన కాంబినేషన్ రిపీటవుతుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: