గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీ తో పాటు ప్రేక్షకుల్లో నూ 'జార్జ్ రెడ్డి' సినిమా గురించి ఎంతో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఉస్మానియా యూనివర్శిటీ స్టూడెంట్ లీడర్ జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నట్లుగా తాజా సమాచారం. ఇక మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు.

జార్జ్ రెడ్డి ఉస్మానియా విద్యార్థి అనే విషయం నాకు తెలుసని.. ఆయన గురించి సినిమా వస్తుందని పోస్టర్లు చూసిన తర్వాత తెలిసిందని...ట్రైలర్ చూసిన తర్వాత జార్జ్ రెడ్డి పాత్రకు సందీప్ మాధవ్ చక్కగా సెట్ అయ్యాడని నాగ బాబు అన్నారు. అంతేకాదు నాకు జార్జ్ రెడ్డి అంటే చాలా అభిమానం. నేను 10వ తరగతిలో ఉన్న సమయం లో అతడు హత్య కాబడ్డాడు. నేను డిగ్రీ కి వచ్చిన తర్వాత జార్జ్ రెడ్డి గురించి పూర్తి గా తెలుసుకున్నాను..అంటు వెల్లడించారు.

చిన్న వయసు లోనే జార్జ్ రెడ్డి సాధించిన గొప్ప విజయాల గురించి చాలా విన్నాను. అతడి ఆవేశం, ఉద్యమ స్ఫూర్తి నాకు..నా తమ్ముడు పవన్ కళ్యాణ్ లో కనిపిస్తాయి. అందుకే నాకు తమ్ముడు పవన్ అంటే ఇష్టం. తన కోసం కాకుండా ఇతరుల కోసం పోరాడే వ్యక్తి జార్జ్ రెడ్డి అన్నాడు. అతడి గురించి అందరికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఈ సినిమా నిజమైన బయోపిక్ అనిపిస్తుందంటూ నాగ బాబు అభిప్రాయపడ్డారు. అంతేకాదు కొన్ని సందర్భాలలో జార్జ్ రెడ్డి గా పవన్ గాని వరుణ్ బాబు గాని చేస్తే బావుంటదనిపించిందన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక ఈ సినిమా నిజమైన బయోపిక్ అన్న మాట చూస్తుంటే ఎవరినో ఇన్‌డైరెక్ట్ గా బాబు కామెంట్ చేశారని కొందరు అనుకుంటున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: