బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో సరిలేరు నీకెవ్వరు టీం స్పెషల్ ట్రీట్ ఇవ్వనుంది. సూపర్ స్టార్ మహేష్, అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో మొదటి సాంగ్ రిలీజ్ కు రంగం సిద్ధమైంది. ఈ సాంగ్ ప్రోమోలో రాహుల్ సిప్లిగంజ్ ను వాడుకుని ప్రమోట్ చేస్తారని తెలుస్తుంది. అయితే ఎవరో పాడిన పాటకు రాహుల్ ఎలా ప్రమోట్ చేస్తాడు అనుకోవచ్చు.


ఆ పాటని పాడింది రాహులే అట. సింగర్ గా జబర్దస్త్ ఫాంలో ఉన్న రాహుల్ బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. హౌజ్ లో ఉన్నప్పుడు కూడా అతనికి చాలా అవకాశాలు వచ్చాయట. ఇప్పుడు మహేష్ సినిమాలోని మొదటి సాంగ్ రాహుల్ దే కావడం విశేషం. 


ఓ పక్క పోటీగా రిలీజ్ అవుతున్న అల వైకుంఠపురములో సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఆ సాంగ్ రిలీజ్ చేసిన విధానం కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు అదే తరహాలో దేవి శ్రీ ప్రసాద్ కూడా తన సింగర్స్ తో పాట పాడించి దాన్నే సాంగ్ ప్రోమోగా రిలీజ్ చేస్తాడని తెలుస్తుంది.


సంక్రాంతి సినిమాల పోటీ కేవలం హీరోల మధ్యే కాదు సంగీత దర్శకుల మధ్య కూడా అనేంతలా టఫ్ ఫైట్ ఉంది. అల వైకుంఠపురములో.. సరిలేరు నీకెవ్వరు సినిమాల మ్యూజిక్ మీద ఆడియెన్స్ అంత గురి పెట్టుకుని ఉన్నారు. అల్లు అర్జున్ సినిమాకు థమన్ ఆల్రెడీ ది బెస్ట్ అనిపించుకోగా దేవి శ్రీ ప్రసాద్ ఏం చేస్తాడో చూడాలి. ఒకవేళ దేవి ఈసారి సరైన మ్యూజిక్ ఇవ్వకుంటే మాత్రం అతన్ని విమర్శించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. అందుకే దేవి కూడా సరిలేరు నీకెవ్వరు సాంగ్స్ విషయంలో ఎక్కువ జాగ్రత్త పడుతున్నాడని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: