తెలుగు హీరోయిన్లు అంటే ఒక సావిత్రి గారు అని అందరు అంటున్నారు. అంటే వారికి ప్రత్యేకత ఏంటి అని అందరికి డౌట్. అప్పటిలో తెలుగు వాళ్ళు చాలా అందంగా ఉండటమే కాదు కట్టు బొట్టు సంప్రదాయంగా ఉంటారు కాబట్టే వారు సినీ ఇండస్ట్రీలో ఎక్కువకాలం కొనసాగారు. అదికాకుంటే చెన్నై నుండి లేక ముంబై నుండో వచ్చేవారు. ఇప్పటికాలంలో తెలుగు హీరోయిన్లకు అంత గుర్తింపు లేదు. 


అందాల ఆరబోతకు మాత్రమే హీరోయిన్లు పరిమితమవుతున్నారు. అందుకనే, మనవాళ్లు ముంబై నుంచి హీరోయిన్లలను పట్టుకొస్తున్నారు. ఈ మధ్యకాలంలో కేరళ, కర్ణాటక నుంచి కూడా మన ఇండస్ట్రీకి హీరోయిన్లు వస్తున్నారు. కానీ, తెలుగమ్మాయిలే కనిపించడంలేదు.కాగా, ఇప్పుడు తెలుగులో అతికొద్ది మంది తెలుగు హీరోయిన్లు మాత్రమే నిలిచారు. వారిలో ఇషా రెబ్బా కూడా ఒకరిని చెప్పాలి. 


హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈషా ఎంబీఏ చదివారు. చదువుతున్నప్పుడే మోడలింగ్ చేశారు. ఈమెను చూసిన దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ ‘అంతకు ముందు ఆ తరవాత’ సినిమాతో వెండితెరకు పరిచయం చేశారు. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకర్షించింది ఈ తెలుగమ్మాయి. ఆ తరవాత ‘అమీ తుమీ’, ‘అ!’, ‘బ్రాండ్ బాబు’, ‘అరవింద సమేత’, ‘సుబ్రహ్మణ్యపురం’, ‘సవ్యసాచి’ సినిమాల్లో నటించారు.ఎంతగా చేసిన కూడా ఈమెకు మాత్రం హిట్ రాలేదు. 


ప్రస్తుతం రాగాల 24 గంటల్లో సినిమాలో నటించింది. చూడటానికి ఎంతో అందంగా ఉన్న ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో మాత్రం బాగా ఫాలోయింగ్ ఉంది. హాట్ డ్రెస్సులు వేసి అందరికి హీటెక్కిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఈషా బ్లాక్ అండ్ వైట్ ఫొటో షూట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో ఈషా చాలా హాట్‌గా ఉన్నారు. ఇవే కాదు గతంలో ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన చాలా ఫొటోలు హాట్‌గా ఉన్నాయి. సినిమా అవకాశాలు రావాలంటే మాత్రం ఈ మాత్రం ఇప్పాల్సిందే.. 


మరింత సమాచారం తెలుసుకోండి: