చాలా కాలం గ్యాప్ తీసుకొని మరి న్యూ లుక్ లో కనిపించడానికి బన్నీ చాలా కసరత్తులు చేసి మరి తెరకెక్కిస్తున్న సినిమా అల వైకుఠ పురముల.. త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీ కలయికలో వస్తున్న ఈ సినిమా ఎంతవరకు హిట్ అవుతుంది అనే విషయం పక్కన బెడితే.. వీరిద్దరి కాంబినేష్లో వస్తున్న మూడో సినిమా అవ్వడంతో బన్నీ ఫ్యాన్స్ ఖుషీఖుషీగా ఫీల్ అవుతున్నారు.


గతంలో వీరిద్దరి కాంబిేషన్లో వచ్చిన జులాయి లో బన్నీ ముందుచూపు అందరికీ నచ్చడంతో రొమాంటిక్ బన్నీ కి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం కాదు మంచి కలెక్షన్స్ ను కూడా రాబట్టింది. దానితో చాలా సినిమా అవకాశాలు వచ్చాయి.. ఈ సినిమా కూడా హిట్ అవ్వడంతో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా మళ్ళీ వీరిద్దరి కాంబోలో వచ్చింది.. దండ్రి కోసం చేసే కొడుకుగా ఈ సినిమా బన్నీ కనిపించడంతో సినిమా సూపర్ హిట్ అయింది..


ప్రస్తుతం మళ్లీ వీరిద్దరు కలిసి ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నారు ఆ సినిమానే అల వైకుంఠ పురములో.. ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. పూజ హెగ్డే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సెకండ్ షెడ్యూల్ షూట్ లో బిజీగా ఉన్న ఈ సినిమాలో మొన్న ఓ పాటను రిలీజ్ చేశారు.. ఆ పాటే రామూలో.. రాముల ఈ పాట విడుదల అయిన కొద్ది నిమిషాలకే టాప్ వ్యూస్ తో దూసుకుపోతుంది...


ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేసే ఆలోచనలో  ఆ చిత్ర యూనిట్ ఉన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా రేపు (నవంబర్ 14న) ‘ఓఎంజీ డాడీ’ అంటూ సాగే పాట టీజర్‌ను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు ప్రకటించాలని ప్లాన్ చేశారు. అయితే, సాయంత్రం రావాల్సిన అనౌన్స్‌మెంట్ ముందుగానే వచ్చేసింది. ట్వీట్ చేసి డిలీట్ చేసారు అయితే సాంగ్ రిలీజ్ చేస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: