రాబోతున్న సంక్రాంతి రేసు పోటీ చాల టైట్ గా మారిపోవడంతో మహేష్ కు ‘సరిలేరు నీకెవ్వరు’ గురించి విపరీతమైన టెన్షన్ పెరిగి పోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ‘అల వైకుంఠపురములో’ మూవీ మ్యానియా రోజురోజుకు పెరిగిపోతున్న ఈ పరిస్థితులలో తన సినిమా ఫైనల్ రిజల్ట్ గురించి అదేవిధంగా దర్శకుడు అనీల్ రావిపూడి ఈ మూవీని ఎలా తీస్తున్నాడు అన్న విషయాల పై టెన్షన్ పెరిగి పోవడంతో మహేష్ వంశీ పైడిపల్లి సహకారం కోరినట్లు వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు మహేష్మూవీ పాటల చిత్రీకరణ కోసం కేరళ వెళ్ళే ముందు వంశీ పైడిపల్లిని పిలిచి ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు ఎడిట్ చేసిన సీన్స్ ను చూపించినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ మూవీలో హీరోను ఎలివేట్ చేసే సీన్స్ విషయంలో అనీల్ రావిపూడి సమర్థవంతంగా ఆ సీన్స్ ను తీయలేకపోయాడు అన్న అభిప్రాయం మహేష్ కు రావడంతో ఈ సీన్స్ విషయమై మహేష్ వంశీ పైడిపల్లి అభిప్రాయం అడిగినట్లు తెలుస్తోంది. 

దీనితో వంశీ పైడిపల్లి రంగంలోకి దిగి ఇప్పటి వరకు ఎడిట్ చేసిన సీన్స్ ను చూసి కొన్ని మార్పులు చేర్పులు సూచించినట్లు ఇండస్ట్రీలో వార్తలు కూడ వస్తున్నాయి. ఈ వార్తలను అనీల్ రావిపూడి ఖండించక పోవడంతో ఈ వార్తలు నిజమే అన్న అభిప్రాయం కలుగుతోంది. 

వాస్తవానికి అనీల్ రావిపూడి మేకింగ్ స్టైల్ కు వంశీ పైడిపల్లి టేకింగ్ స్టైల్ కు చాల వ్యతాసాలు ఉన్నాయి. అయితే సినిమాలను కొద్దిగా స్లోగా తీస్తాడు అని పేరున్న వంశీ పైడిపల్లి ‘సరిలేరు నీకెవ్వరు’ ఎడిటింగ్ లో వేలు పెట్టడంతో అసలుకు మోసం వస్తుందా ? అనే సందేహాలు ఈ మూవీ బయ్యర్లకు మహేష్ అభిమానులకు కలుగుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: