వెంకటేష్ ఎంతో మోజుపడి తెలుగులో
రీమేక్ చేయబోతున్న ‘అసురం’ మూవీకి సంబంధించిన సమస్యలు ఒకదాని వెంట ఒకటి
వెంకటేష్ ను వెంటాడుతున్నాయి. ఈ మూవీకి దర్శకుడుగా హనూ రాఘవ పూడి ఎంపిక కావడంతో ఈ మూవీకి సంబంధించిన దర్శకుడి సమస్య తీరింది అనుకున్నారు.
అయితే దర్శకుడి సమస్య తీరిన తరువాత ఈ మూవీకి
హీరోయిన్ సమస్య ఎదురౌతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘అసురం’
తమిళ మూవీలో
ధనుష్ పక్కన
హీరోయిన్ గా
మంజు వారియర్ నటించింది. ఈ
మూవీ ఘన విజయంలో ఆమె నటన కూడ అత్యంత కీలకంగా మారింది. ఇద్దరి టీనేజ్ పిల్లలు తల్లిగా
మంజు వారియర్ చూపించిన అద్భుతమైన నటనకు
తమిళ ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అయ్యారు.
అయితే ఈ
మూవీ తెలుగు
రీమేక్ లో మంజు వారియన్ ను కాకుండా శ్రియను ఎంపిక చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి
శ్రియ వెంకటేష్ తో ‘వెంకీమామ’ సినిమాలో నటించడానికి ఒప్పుకుని అడ్వాన్స్ లు కూడ తీసుకుని కొన్ని కారణాలు వల్ల ఆ
మూవీ ప్రాజెక్ట్ లో ఆమె నటించలేకపోయింది. దీనితో ఆమెకు ఇచ్చిన అడ్వాన్స్ ను రాబెట్టు కోవడానికి ‘అసురం’
రీమేక్ లో శ్రియను దించుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ పాత్రకు
శ్రియ సరిపోదు అని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో రమ్యకృష్ణను ఈ మూవీలోని
వెంకీ భార్య పాత్ర కోసం అడుగుతున్న పరిస్థితులలో ఆమె చెపుతున్న భారీ పారితోషికం ఈ మూవీని నిర్మిస్తున్న సురేశ్ బాబుకు చుక్కలు చూపెడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూవీలో
ధనుష్ తన నటనలో కనపరిచిన రెండు షేడ్స్ పాత్రలలోని వైవిధ్యాన్ని
వెంకటేష్ ఈ వయసులో చూపించలేడు అని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో
వెంకీ మామకు ఎదురౌతున్న
భార్య కష్టాలు
ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి..