వెంకటేష్ ఎంతో మోజుపడి తెలుగులో రీమేక్ చేయబోతున్న ‘అసురం’ మూవీకి సంబంధించిన సమస్యలు ఒకదాని వెంట ఒకటి వెంకటేష్ ను వెంటాడుతున్నాయి. ఈ మూవీకి దర్శకుడుగా హనూ రాఘవ పూడి ఎంపిక కావడంతో ఈ మూవీకి సంబంధించిన దర్శకుడి సమస్య తీరింది అనుకున్నారు. 

అయితే దర్శకుడి సమస్య తీరిన తరువాత ఈ మూవీకి హీరోయిన్ సమస్య ఎదురౌతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘అసురం’ తమిళ మూవీలో ధనుష్ పక్కన హీరోయిన్ గా మంజు వారియర్ నటించింది. ఈ మూవీ ఘన విజయంలో ఆమె నటన కూడ అత్యంత కీలకంగా మారింది. ఇద్దరి టీనేజ్ పిల్లలు తల్లిగా మంజు వారియర్ చూపించిన అద్భుతమైన నటనకు తమిళ ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. 

అయితే ఈ మూవీ తెలుగు రీమేక్ లో మంజు వారియన్ ను కాకుండా శ్రియను ఎంపిక చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి శ్రియ వెంకటేష్ తో ‘వెంకీమామ’ సినిమాలో నటించడానికి ఒప్పుకుని అడ్వాన్స్ లు కూడ తీసుకుని కొన్ని కారణాలు వల్ల ఆ మూవీ ప్రాజెక్ట్ లో ఆమె నటించలేకపోయింది. దీనితో ఆమెకు ఇచ్చిన అడ్వాన్స్ ను రాబెట్టు కోవడానికి ‘అసురం’ రీమేక్ లో శ్రియను దించుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈ పాత్రకు శ్రియ సరిపోదు అని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో రమ్యకృష్ణను ఈ మూవీలోని వెంకీ భార్య పాత్ర కోసం అడుగుతున్న పరిస్థితులలో ఆమె చెపుతున్న భారీ పారితోషికం ఈ మూవీని నిర్మిస్తున్న సురేశ్ బాబుకు చుక్కలు చూపెడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూవీలో ధనుష్ తన నటనలో కనపరిచిన రెండు షేడ్స్ పాత్రలలోని వైవిధ్యాన్ని వెంకటేష్ ఈ వయసులో చూపించలేడు అని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో వెంకీ మామకు ఎదురౌతున్న భార్య కష్టాలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: