సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా స్మాల్ స్క్రీన్ పై సీరియల్స్, రియాలిటీ షోల హవా మాత్రం ఓ రేంజ్ లో కొనసాగుతుంది. ముఖ్యంగా ఈటివి ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఓ పది అడుగులు ముందే ఉంది. కాలాన్ని బట్టి మారుతున్న కామెడీ కల్చర్ ను ఆహ్వానిస్తూ జబర్దస్త్, పటాస్ వంటి షోలతో టాప్ టి.ఆర్.పి రేటింగులను సాధిస్తుంది. 


కామెడీతో కితకితలు పెట్టించడమే కాదు డ్యాన్స్ షోతో కూడా దుమ్ముదులిపేస్తున్నారు. ఈటివిలో ప్రసారమవుతున్న సూపర్ హిట్ డ్యాన్స్ షో ఢీ 11 సీజన్లుగా ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉంది. ఢీ జోడీ తర్వాత ప్రస్తుతం ఢీ ఛాంపియన్స్ ప్రసారమవుతుంది. ఈ షోలో శేఖర్ మాస్టర్, ప్రియమణి, పూజాలు జడ్జులుగా ఉంటున్నారు.


మాములుగా అయితే ఢీ షోకి యాంకర్ గా ప్రదీప్ ఉంటాడు.. కాని రెండు సీజన్లుగా అతనే ఉంటున్నాడని ఈసారి సుధీర్, రష్మిలను యాంకర్లుగా పెట్టి రవి, వర్షిణిలను టీం లీడర్స్ గా పెట్టారు. వచ్చి రాని యాంకరింగ్ తో సుడిగాలి సుధీర్ చేసే హంగామా బాగానే ఉన్నా లేటెస్ట్ ఎపిసోడ్ లో హీరోయిన్ ప్రియమణిని టీజ్ చేస్తూ మేకప్ లేకపోతే ఆమెను చూడటం కష్టమని.. ఆమె తెలుగు మాట్లాడటం గురించి కూడా ఎగతాలిగా మాట్లాడాడు సుధీర్.


దానితో హీరోయిన్ పియమణి హర్ట్ అయినట్టు తెలుస్తుంది. షో నుండి వెళ్లిపోయేంత కోపం వచ్చినా తప్పక అలా కూర్చుండిపోయింది. అయితే సుధీర్ మాత్రం ఆమెను పట్టించుకోకుండా షో చేస్తూ వచ్చాడు. రష్మితో తను చేసే వెకిలి కామెడీ రొటీన్ గానే అనిపించినా షోకి మాత్రం అది మంచి హైప్ వచ్చేలా చేస్తుంది. అయితే ఏమాటకామాట చెప్పాలనుకుంటే సుధీర్ రష్మిల యాంకరింగ్ కన్నా ప్రదీప్ మచిరాజు చేసే యాంకరింగ్ బాగుంది. యాంకర్ ప్రదీప్ ఒక నెల పాటు షోలకు దూరంగా ఉంటున్నాడు. 


 


మరింత సమాచారం తెలుసుకోండి: