మాస మహారాజ్ రవితేజ కొత్త కొత్త సినిమాలు తీస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో డిస్కోరాజా సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా తర్వాత ఖాళీగా ఉండకుండా రవితేజ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను కూడా ఫైనల్ చేసేశాడు. నెక్స్ట్ చిత్రం పక్క హిట్ కొట్టాలని ఉద్దేశ్యంతో తన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో మరో చిత్రం తియ్యనున్నాడు. 


అతను ఎవరు అనుకుంటున్నారా ? అతనే అండి. గోపీచంద్ మలినేని. డాన్‌ శీను, బలుపు లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను తీసిన గోపి చంద్ దర్శకత్వంలో హైట్రిక్ సినిమా తీస్తున్నాడు మాస్ మహారాజ రవితేజ. అయితే ఈ సినిమా గురువారం ప్రారంభం కానుంది. దీంతో ఈ సినిమాకు డాన్ శీను, బలుపు లాంటి విచిత్ర చిత్ర టైటిల్ ను ఖరారు చేశారు. 


ఆ టైటిల్ పేరే క్రాక్. ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాడని, ఈ సినిమా నిజ జీవిత సంఘటనలు ఆధారం చేసుకొని తెరకెక్కుతుంది అని, నిజంగానే ఓ పోలీస్ ఆఫీసర్ భిన్నమైన మనస్తత్వంతో ప్రజలకు మంచి చేశాడని అదే కథని.. ఇంకా సినిమా షూటింగ్ ప్రారంభమే కాలేదు అప్పుడే కథ లీక్ అంటూ వార్తలు వచ్చాయి. మరి ఈ కథ ఎంతవరుకు నిజమనేది సినిమా చూస్తే కానీ తెలియదు. 


సరస్వతి ఫిలిం డివిజన్‌ బ్యానర్‌లో బీ మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన కథానాయకగా శృతిహాసన్‌ నటిస్తోంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శృతి హాసన్ ఈ సినిమాతో రీఏంట్రీ ఇవ్వనుంది. కాగా ఈ సినిమాలో కోలీవుడ్‌ నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: