మాస మహారాజ్
రవితేజ కొత్త కొత్త సినిమాలు తీస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ ఉన్నాడు. ఈ
సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ
సినిమా తర్వాత ఖాళీగా ఉండకుండా
రవితేజ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను కూడా ఫైనల్ చేసేశాడు. నెక్స్ట్ చిత్రం పక్క హిట్ కొట్టాలని ఉద్దేశ్యంతో తన
సక్సెస్ ఫుల్
డైరెక్టర్ తో మరో చిత్రం తియ్యనున్నాడు.
అతను ఎవరు అనుకుంటున్నారా ? అతనే అండి. గోపీచంద్ మలినేని. డాన్ శీను, బలుపు లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను తీసిన గోపి చంద్ దర్శకత్వంలో హైట్రిక్
సినిమా తీస్తున్నాడు మాస్ మహారాజ రవితేజ. అయితే ఈ
సినిమా గురువారం ప్రారంభం కానుంది. దీంతో ఈ సినిమాకు డాన్ శీను, బలుపు లాంటి విచిత్ర చిత్ర టైటిల్ ను ఖరారు చేశారు.
ఆ టైటిల్ పేరే క్రాక్. ఈ సినిమాలో
రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడని, ఈ
సినిమా నిజ
జీవిత సంఘటనలు ఆధారం చేసుకొని తెరకెక్కుతుంది అని, నిజంగానే ఓ
పోలీస్ ఆఫీసర్ భిన్నమైన మనస్తత్వంతో ప్రజలకు మంచి చేశాడని అదే కథని.. ఇంకా
సినిమా షూటింగ్ ప్రారంభమే కాలేదు అప్పుడే కథ లీక్ అంటూ వార్తలు వచ్చాయి. మరి ఈ కథ ఎంతవరుకు నిజమనేది
సినిమా చూస్తే కానీ తెలియదు.
సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్లో బీ మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో
రవితేజ సరసన కథానాయకగా శృతిహాసన్ నటిస్తోంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న
శృతి హాసన్ ఈ సినిమాతో రీఏంట్రీ ఇవ్వనుంది. కాగా ఈ సినిమాలో కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.