బాలకృష్ణ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిత్య 369’
బాలయ్య సినిమాలో ఒక మాస్టర్పీస్. ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని
బాలకృష్ణ ఎంతగానో ఆలోచిస్తున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో
బాలకృష్ణ సినిమాలకు
మార్కెట్ బాగా తగ్గిపోవడంతో ‘ఆదిత్య 999’ పేరుతో తీయాలనుకున్న ఈ సీక్వెల్ సెట్స్ పై కి వెళ్ళలేదు.
ఒకానొక సమయంలో ఈ సీక్వెల్ ద్వారా మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తే ఎలా యుంటుంది అన్న ఆలోచనలు కూడ బాలయ్యకు వచ్చాయి. అయితే మోక్షజ్ఞకు సినిమాల పై ఏమాత్రం ఆశక్తి కనపరచక పోవడంతో ఆలోచనలను
బాలకృష్ణ విరమించుకున్నాడు.
ఇలాంటి పరిస్థితులలో ఈ సీక్వెల్ కి సంబంధించిన ఒక ఆసక్తికర న్యూస్ బయటకు వచ్చింది. టైమ్ మెషీన్ నేపథ్యంలో తెరకెక్కించే ఈ సినిమాలో
కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ బాలకృష్ణతో కలసి నిర్మించ బోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ఆధారంగా చేసుకుని టైమ్ మెషీన్ బ్యాక్ డ్రాప్ లో
కళ్యాణ్ రామ్ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ అయింది అని తెలుస్తోంది.
ఐదు దశాబ్ధాల ముందు అంటే 1950 సమయంలో నడిచే స్టోరీ ఇదని అంటున్నారు. ఈ మూవీకి వేణు మల్లిడి దర్శకత్వం వహించబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం
కళ్యాణ్ రామ్ సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఎంతమంచి వాడవురా’
మూవీ రిలీజ్ అయిన తరువాత ఈ ప్రాజెక్ట్ విషయమై ఒక స్పష్టత వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు. ప్రస్తుతం ఈవార్తలు వైరల్ కావడంతో
బాలయ్య అభిమానులు మాత్రం ఈ
మూవీ సీక్వెల్ లో మోక్షజ్ఞ కనిపిస్తాడు అనుకుంటే
కళ్యాణ్ రామ్ వచ్చి చేరాడా అంటూ భారీ నిట్టూర్పులు విడుస్తున్నట్లు టాక్. దీనితో
బాలయ్య అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో అర్ధం అవుతుంది..