హీరోయిన్ నయనతార ఇప్పటికీ ఎక్కడ కూడా తగ్గకుండా పెరుగుతూనే వరుస విజయాలు సాధిస్తుంది. స్టార్ హీరోలందరి పక్కన ఇంకా అవకాశాలు దక్కించుకుంటూ ప్రస్తుతం ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరోయిన్లకు ఏమాత్రం పోటీ ఇవ్వటంలో తగ్గకుండా తన క్రేజ్ ఏంటో తన మార్కెట్ ఏంటో నిరూపిస్తోంది. తాజాగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పక్కన సైరా నరసింహారెడ్డి సినిమాలలో హీరోయిన్ గా నటించే అద్భుతమైన విజయాన్ని సాధించింది నయనతార. ఇదిలా ఉండగా గతంలో హీరోయిన్లు మంచి విజయాలు సాధించిన తర్వాత భక్తి సినిమాలు నాగదేవత నాగమ్మ దేవి వంటి చిత్రాలలో నటించి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు టైపు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరించేవారు.
ఈ నేపథ్యంలో అదే తరహాలో సీనియర్ హీరోయిన్ల ఫార్ములాలు ఉపయోగించడానికి నయనతార రెడీ అయినట్లు ప్రస్తుత పరిణామాలు బట్టి తెలుస్తుంది. విషయంలోకి వెళితే నయనతార ప్రధాన పాత్రలో తమిళంలో ఓ సినిమా ప్రారంభమైంది. ‘మూకుత్తి అమ్మన్’ టైటిల్ తో రూపొందే ఈ చిత్రంలో నయనతార నాగ దేవత గా కనిపించనుంది. ‘మూకుత్తి అమ్మన్’. తెలుగులో ‘ముక్కుపుడక ఉండే అమ్మవారు’ అని అర్థం. అయితే మరోపక్క ఈ సినిమా భక్తి పరమైనది కాదు..పూర్తి వ్యంగ్యంతో కూడిన సెటైర్ అని తెలుస్తోంది.
రేడియో జాకీ నుంచి హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆర్జే బాలాజీ ఈ సినిమా కు కథ,మాటలు, దర్శకత్వం అందిస్తున్నారు. 'ఎల్కేజీ 'చిత్రంతో హీరోగా అడుగుపెట్టి పెద్ద హిట్ ని సొంతం చేసుకున్నారు. తనదైన స్టైల్ లో వేసిన పంచ్ డైలాగులు ఈ పొలిటికల్ సెటైర్ చిత్రానికి కలిసిరావడంతో హిట్టాక్ అందుకుంది. దాంతో నయనతారను ఒప్పించి..ఇప్పుడీ సినిమాని తెరకెక్కించే ఆలోచనలో వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అంతా ఈ సినిమాకి ఓకే అయితే ఇద్దరు డైరెక్టర్లు ఎన్జె శరవణన్, ఆర్జే బాలాజీ సినిమాని తెరకెక్కించడానికి ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం.