టాలీవుడ్ సినిమా పరిశ్రమకు తొలితరం దిగ్గజ నటులైన ఎన్టీఆర్, ఎఎన్నార్ ల అనంతరం, తరువాత తరంలో కృష్ణ, శోభన్ బాబు కృష్ణంరాజు వంటి నటులు మంచి పేరు సంపాదించి అగ్రనటులుగా నిలిచారు. ఇక తొలుత విలన్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుని, ఆ తరువాత హీరోగా మారి పలు విజయవంతమైన సినిమాల్లో నటించడంతో పాటు వారి నుండి రెబల్ స్టార్ అనే పేరు సంపాదించిన నటుడు కృష్ణంరాజు. 

ఎన్నో గొప్ప గొప్ప చిత్రాల్లో నటించిన కృష్ణంరాజు, ఆ తరువాత గోపికృష్ణ మూవీ పేరిట ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి పలు సక్సెస్ఫుల్ సినిమాలు తీయడంతో పాటు, కొన్నాళ్ళకు రాజకీయాల పట్ల ఆసక్తితో బీజేపీ పార్టీలో కూడా చేరడం జరిగింది. ఇకపోతే నిన్న రాత్రి ఆయనకు తీవ్ర అనారోగ్యం కారణంగా కుటుంబసభ్యులు ఆయనను బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. కొద్దిరోజలుగా నిమోనియా వ్యాధితో బాధపడుతున్న కృష్ణంరాజు గారి ఆరోగ్యం నిన్న రాత్రి మరింత క్షీణించడంతో పరిస్థితిని గమనించి కుటుంబ సభ్యులు ఆయనను కేర్ కు తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనను ఐసియులో ఉంచడంతో పాటు, కొందరు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఆయన ఆరోగ్యం ప్రస్తుతం ఒకింత ఇంకా నిలకడగానే ఉందని, అతి త్వరలోనే ఆయన కోలుకుని మళ్ళి మాములు మనిషి అవుతారని డాక్టర్లు చెపుతున్నారట. కాగా ఈ విషయం కాసేపటి క్రితం బయటకు రావడంతో పలువురు సినిమా మరియు రాజకీయ రంగ ప్రముఖులు కృష్ణంరాజు ఆరోగ్యంపై వాకబు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే హీరో ప్రభాస్ కు ఈ విషయం తెలియగానే హైదరాబాద్ చేరుకున్నారని సమాచారం. ఇక ఇప్పటికే వరుసగా ఎందరో గొప్ప నటులను కోల్పోతున్న సినిమా పరిశ్రమకు ఏమి జరుగుతుందో తెలియడంలేదని, ఈ విధంగా గొప్ప నటుల ఆరోగ్యం దెబ్బతినడం తమను ఎంతో కలిచి వేస్తోందని పలువురు సినిమా నటులు వాపోతున్నారు. ఆయన అతి త్వరలో కోలుకుని మళ్ళి మన మధ్యకు రావాలని కోరుకుంటూ పలువురు రెబల్ స్టార్ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: