గత సంవత్సరం నవంబర్ 14, 15వ తేదీల్లో ఇటలీలోని లేక్‌ కోమోలో కొంకిణి, సింథి సంప్రదాయాల ప్రకారం దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ వివాహం చేసుకున్నారు. ఈరోజు అనగా గురువారం నాడు ఈ బాలీవుడ్ కపుల్ తమ మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తన కుటుంబంతో సహా దర్శించారు. ఈ జంట ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొన్న దీపిక పదుకొనె, రణవీర్ సింగ్ స్వామివారి ఆశీస్సులు పొందారు. 


వీరు వస్తున్నారనే విషయం ముందుగానే తెలుసుకున్న ఆలయ అధికారులు దర్శనానికి ఏర్పాట్లు చేసి వారిని కి ఘన స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత వారికి రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం పలికి శేష వస్త్రాలను సత్కరించారు. ఆ తర్వాత తీర్థప్రసాదాలను, స్వామి వారి చిత్రపటాన్ని వారికి అందించారు. 


ఈ సందర్భంగా దీపికా పడుకొనే తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక ఫోటోను అప్లోడ్ చేసి, "మా మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకున్నాము. మీ ప్రేమాభిమానాలకు, శుభాకాంక్షలు చెప్తున్న మీ అందరికి నా ధన్యవాదాలు." అంటూ తన పోస్ట్ లో రాసారు.  


రేపు అనగా శుక్రవారం రోజు వాళ్ళ అమృతసర్‌లోని స్వర్ణదేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇక వారి సినిమాల విషయాని కొస్తే రణవీర్ సింగ్ దీపికా పదుకొనే కలిసి 83 సినిమాలో నటిస్తున్నారు. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రని రణవీర్ సింగ్ పోషించగా... అతని సతీమణి రోమీ పాత్రని దీపికా పదుకొనే పోషిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: