ఛలో సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటిన వెంకీ కుడుముల తన సెకండ్ మూవీని నితిన్ తో చేస్తున్న విషయం తెలిసిందే. నితిన్, రష్మిక జంటగా భీష్మ సినిమా చేస్తున్నాడు వెంకీ కుడుముల ఈమధ్యనే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజైంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తప్పకుండా హిట్టు కొట్టేలా ఉన్నాడు వెంకీ.


కేవలం ఫస్ట్ లుక్ టీజర్ తోనే ఈ సినిమా రిజల్ట్ తెలిసిపోయింది. ఛలో లానే ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని అంటున్నారు. అయితే ఈ సినిమా తర్వాత వెంకీకి మరో క్రేజీ ఆఫర్ వచ్చిందట. వెంకీ కుడుముల మైత్రీ మూవీ మేకర్స్ ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సెట్స్ మీద ఉన్న భీష్మ సినిమా పక్కా హిట్ అన్న సంకేతాలు వచ్చాయట.


అందుకే వెంకీని ముందే బుక్ చేసుకున్నారు మైత్రి మూవీ మేకర్స్. స్టార్ సినిమాలతో పాటుగా మీడియం బడ్జెట్ సినిమాలు ఈ నిర్మాణ సంస్థ చేస్తుంది. వెంకీ కుడుములకు ఇది కచ్చితంగా లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఇక భీష్మ సినిమా విషయానికి వస్తే ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది.


భీష్మ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో ఆమె స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. ఇప్పటికే నడుము అందాలతో టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచింది రష్మిక. వరుసగా స్టార్స్ తో సినిమాలు చేస్తున్న రష్మిక నితిన్ లాంటి యువ హీరోతో చేయడం కచ్చితంగా భీష్మకు లక్ కలిసి వస్తుందని అంటున్నారు. శ్రీనివాస కళ్యాణం తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో వరుసగా మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. భీష్మ తర్వాత రంగ్ దే, ఆ తర్వాత చంద్రశేఖర్ యేలేటి సినిమా చేస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: