యూత్ హీరో సందీప్ కిషన్ హీరోగా స్టన్నింగ్ బ్యూటీ హన్సిక మోత్వాని హీరోయిన్ గా జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, శ్రీనివాస్, కె.సంజీవ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం "తెనాలి రామకృష్ణ". ఈ చిత్రం నవంబర్15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  


దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... నేను ఇంత కూల్ గా ఉండటానికి ప్ర‌ధాన కారణం నాలుగు పిల్లర్స్ నా నిర్మాతలు. ప్యాష‌నేట్ తో సినిమాని నిర్మించారు. సందీప్ కిషన్ సినిమా పిచ్చోడు. సినిమా తప్ప అతనికి ఇంకా ఏమి తెలీదు. సినిమా అంటే అంద‌ర్నీ ఎల‌ర్ట్ చేసుకుంటే చాలా కోపరేవ్‌గా వ‌ర్క్ చేస్తారు. నిర్మాతల హీరో సందీప్ కిషన్. ఇలాంటి హీరోలు చాలా అరుదుగా దొరుకుతారు. గ‌తంలో కృష్ణ‌, శ్రీ‌కాంత్‌ల గురించి విన్నాను ప్రొడ్యూస‌ర్ల‌కి ఫ్రీగా సినిమాలు చేసే వాళ్ళ గురించి మ‌ళ్ళీ ఇప్పుడు సందీప్ కిష‌న్ గురించి వింటున్నాను. పాపం ఎవ‌ర‌న్నా క‌ష్టాల్లో ఉన్నారని తెలిస్తే సందీప్ డ‌బ్బులు అడ‌గ‌కుండా సినిమా చేస్తాడు. అలాగే హన్సిక అన్ని ఎమోషన్స్ బాగా డీల్ చేసింది. హ‌న్సిక కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ప్ర‌తి ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ కష్టపడి వర్క్ చేశారు.. వారి అందరికి నా థాంక్స్.. సినిమాని హిట్ చెయ్యాలని కోరుకుంటున్నాను.


నిర్మాత అగ్రహారం నాగిరెడ్డి మాట్లాడుతూ... చిత్రంలో నటించిన నటీనటులకు స్టార్ డం వస్తుంది.. అంత బాగా నటించారు. ముఖ్యంగా మా హీరో సందీప్ కిషన్ చాలా కష్టపడి వర్క్ చేశారు. అలాగే మా దర్శకుడు నాగేశ్వర రెడ్డి అంతా తానై ఈ ప్రాజెక్ట్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశాడు.. సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు..


మరో నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ.. జవ్వాజి రామాంజనేయులు గారు మాకు బాగా సపోర్ట్ చేశారు. టీమ్ వర్కతో సినిమా కంప్లీట్ చేశాం. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది.. అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: