డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఒక్క సినిమాలో నటిస్తే చాలు ఎవరైనా కాస్తో కూస్తో పాపులర్ అవ్వాల్సిందే. అది హీరో అయినా, హీరోయిన్ అయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా. అలా పాపులర్ అయిన నటీ, నటుల లిస్ట్ చాలానే ఉంది. ఇక ప్రస్తుతం అన్ని భాషల్లో బయోపిక్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. టాలీవుడ్ లో కూడా ఇప్పుడిప్పుడే ప్రముఖుల కథలను బయోపిక్స్ గా సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే తెలుగులో రెండు బయోపిక్ సినిమాల్లో నటించి బయోపిక్ హీరో అనిపించుకుంటున్నాడు ఈ కుర్ర హీరో. అతనే
సాండీ అలియాస్ సందీప్. అప్పటికే రెండు మూడు సినిమాలు చేసినా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'జ్యోతి లక్ష్మి' తో నటుడిగా కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు సాండీ.

జ్యోతి లక్ష్మి సినిమా చేసిన పరిచయంతో పూరికి దగ్గరయ్యాడు. అయితే పూరి క్యాంప్ లో ఇతన్ని చూసి వంగవీటి సినిమాలో అవకాశం ఇచ్చాడు వర్మ. వంగవీటి మోహన రంగా బయోపిక్ గా తెరకెక్కిన ఆ సినిమాలో బాగా నటించి మంచి మార్కులే సంపాదించుకున్నాడు. కానీ ఆ సినిమా అందరు అనుకున్నంతగా సక్సస్ ను సాదించలేక పోయింది. ఎందుకో వర్మ తీసిన ఆ బయోపిక్ ఎవరికీ పెద్దగా ఎక్కలేదు. కట్ చేస్తే మళ్ళీ ఓ బయోపిక్ తో వచ్చాడు సాండీ.

అయితే ఈసారి ఓ స్టూడెంట్ లీడర్ బయోపిక్ తో వస్తున్నాడు. జార్జ్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇదే నెలలో రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం టీజర్స్ తో అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్న ఈ సినిమాను త్వరలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ప్రమోట్ చేయనున్నాడని సమాచారం. సో మొదటి బయోపిక్ తో మెప్పించలేకపోయిన ఈ బయోపిక్ స్టార్ జార్జ్ రెడ్డి తో అయినా మంచి హిట్ అందుకుంటాడెమో చూడాలి. ఒకవేళ ఇదీ కలిసి రాకపోతే ఇక మనవాడి పరిస్థితి అంతే. 



మరింత సమాచారం తెలుసుకోండి: