రాణీ ముఖర్జీ ప్రముఖ
బాలీవుడ్ నటి. ఎన్నో సినిమాలకు ఫిలింఫేర్ వంటి ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు అందుకున్నారు ఆమె. ఇప్పటికి ఏడు ఫిలింఫేర్ పురస్కారాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో
హీరోయిన్ గా నటించారు.
నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన తాజా చిత్రం “మర్దానీ 2”.
బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమిది. 2014లో వచ్చిన
బ్లాక్ బస్టర్ చిత్రం ‘మర్దానీ’కి ఇది సీక్వెల్గా రాబోతోంది. గోపీ పుత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. యశ్రాజ్ ఫిలింస్ బ్యానర్పై తన
భర్త ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వయసవుతున్నప్పటికీ రాణీలో ఉన్న ఆ ఫైర్ ఇంకా అలాగే ఉంది. ఇందులో
విక్రమ్ సింగ్ చౌహాన్, శ్రుతి బాప్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంకా షూటింగ్ జరుగుతోంది.
డిసెంబర్ 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ
సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. యష్రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఓ
అమ్మాయి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ అటుగా వెళుతున్న కారును ఆపి లిఫ్ట్ అడుగుతుంది. ఒంటరిగా
ఆడపిల్ల దొరికింది అన్నట్లు అతను లిఫ్ట్ ఇచ్చినట్లే ఇచ్చి దారుణంగా రేప్ చేసి బాడీని ఓ నదిలో పడేస్తాడు. ఈ కేసును డీల్ చేయడానికి శివానీ
శివాజీ రాయ్ (రాణీ ముఖర్జీ)ని నియమిస్తారు. అత్యాచారానికి గురైన బాధితురాలి డెడ్ బాడీ చూసి హడలిపోతారు. ఆ హంతకుడిని ఎలాగైనా పట్టుకుంటానని శపథం చేస్తుంది. కానీ ఆ హంతకుడు ఆడపిల్లలను
హత్య చేస్తూ వారి ముఖాలకు రాణీ ముఖర్జీ మాస్క్లు అంటిస్తూ ఉంటాడు. చివరికి ఏం జరిగింది? ఆ రాక్షసుడిని రాణీ ముఖర్జీ పట్టుకోగలిగిందా? తదితర విషయాలు తెలియాలంటే
సినిమా విడుదల అయ్యేవరకు ఎదురు చూడాల్సిందే.
విలన్కి, రాణీ ముఖర్జీకి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయని టాక్.ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రం 2019లోనే విడుదల కానుంది.