సూపర్ స్టార్ మహేష్-మాస్ డైరక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరూ'. ఈ సినిమా ప్రమోషన్స్ కి చిత్ర యూనిట్ శ్రీకారం చుడుతున్నారు. వాస్తవానికైతే ఈ నెల 15న పాటతో ప్రమోషన్స్ స్టార్ట్ చేయాల్సి వుంది. కానీ యూనిట్ మొత్తం పోలాచ్చిలో వుండిపోవడంతో, కాస్త వెనక్కు జరుపుతున్నట్లు తాజాగా అందిన వార్తల ద్వారా తెలుస్తోంది. ఏదేమైనా సరిలేరు ప్రమోషన్స్ మొదలవుతుండటంతో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇన్నాళ్ళు 'అల' ప్రమోషన్స్ లో దూసుకెళుతుందని డీలా పడ్డ జానాలకు కూడా ఇది నిజంగా బూస్టప్ ఇచ్చే గుడ్ న్యూస్ అని చెప్పాలి.  

ఇదిలా వుంటే పోలాచ్చిలో వున్న యూనిట్ పనిలో పనిగా అక్కడ కొంత పబ్లిసిటీ మెటీరియల్ కూడా తయారు చేసినట్లు మరో హాట్ న్యూస్. క్యారెక్టర్స్ పరిచయం కోసం ఒక్కో క్యారెక్టర్ మీద ఒక్కో విడియో తయారుచేసినట్లు లేటెస్ట్ అప్‌డేట్. బాహుబలి, సాహో సినిమాల ప్రమోషన్స్ కు రకరకాలుగా క్యారెక్టర్ లను ఇంట్రడ్యూస్ చేసారు. అదే విధంగా చిన్న చిన్న విడియోల ద్వారా పరిచయం చేసే కాన్సెప్ట్ ను కాస్త కొత్తగా దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

సరిలేరు నీకెవ్వరు సినిమాకు ఇంకా మూడు పాటలు చిత్రీకరించాల్సి వుంది. వీటిలో ఒకటి ఐటమ్ సాంగ్. ఈ ఐటమ్ సాంగ్, మరోసాంగ్ ప్రత్యేకంగా సెట్ లో చిత్రీకరిస్తారు. మూడో పాట మెలోడీ సాంగ్ అని అంటున్నారు. ఆ సాంగ్ ను మాత్రం విదేశాల్లో చిత్రీకరిస్తారు. దీంతో సినిమా మొత్తం కంప్లీటవుతుంది. మొత్తానికి సరిలేరు యూనిట్ కొత్తగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతుండటంతో ఖచ్చితంగా అల్లు అరున్ 'అల వైకుంఠపురములో' సినిమాకి పోటీ గట్టిగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హిరోయిన్ గా నటిస్తుండగా లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి ఈ సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 2020సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: