హీరో రాజ్ తరుణ్ వరుస ఫ్లాప్ రావడంతో కాస్త గ్యాప్ తీసుకుని మళ్ళీ మంచి కథలను సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాల్లో ముందుగా 'ఇద్దరి లోకం ఒకటే' విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాని ఓ
హాలీవుడ్ సినిమా ఆధారంగా తెరకెక్కించారని తెలుస్తోంది. ఒక కొత్త రకమైన ఫీల్ గుడ్
లవ్ స్టోరీ ని సెలెక్ట్ చేసుకొని
నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ
సినిమా విషాదాంతం అని వినిపిస్తోంది. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ల కోసం హీరోలు త్యాగాలు చేస్తుంటారు. కానీ ఈ సినిమాలో
హీరోయిన్ నే
హీరో కోసం త్యాగం చేస్తుందని తెలుస్తోంది. సినిమాకు అదే హైలైట్ పాయింట్ గా వుంటుందని సమాచారం. గత కొంతకాలంగా ఇటువంటి పాయింట్ రాకపోవడంతో ఖచ్చితంగా ఈ
సినిమా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ చాలా ధీమాగా ఉందట. అభినందన,
ప్రేమ నగర్, ప్రేమాభిషేకం వంటి సినిమాల మాదిరిగా ఈ
సినిమా కూడా సూపర్ హిట్టవుతుందని చెప్పుకుంటున్నారు.
పెద్ద హీరోల సినిమాలు అయితే విషాదాంతం అయితే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారేమోగాని... యంగ్ హీరోల సినిమాలు కాబట్టి, వాటిని పెద్ద బ్యానర్లు తీసినపుడు కాస్త ప్రయోగాలు చేయవచ్చు. ఖచ్చితంగా హిట్ అయ్యో అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అందుకే దిల్ రాజు ఈ
సినిమా స్క్రిప్ట్ ను ఓకె చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమాను
గల్లా అశోక్ తో తీయాలనుకున్నారు. కానీ కొత్త
హీరో సరిపోకపోవడంతో, ప్రాజెక్టు ను
రాజ్ తరుణ్ తో చేస్తున్నారు. అయితే
షాలిని పాండే కి ఈ
సినిమా తర్వాత ఎలాంటి పాత్రలు వస్తాయోనని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. ఇక రీసెంట్ గా
కళ్యాణ్ రామ్ తో నటించిన
118 సినిమాతో
సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.