అనిల్ రావిపూడి -సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. టాకీ పార్ట్ కంప్లీటవగా..3 సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట. వాటిలో రెండు ప్రత్యేకంగా వేసిన సెట్ లో చిత్రీకరించనుండగా ఒక సాంగ్ ను ఫారిన్ లో చిత్రీకరించబోతున్నారు. ఇక ఇప్పటికే మొదలైన ప్రమోషన్స్ తో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే పోస్టర్స్ తో ఎంతగానో ఆకట్టుకుంటున్న సరిలేరు టీం ఇప్పుడు మ్యూజిక్ తోనూ హడావిడి చేయబోతుంది. సరిలేరు నీకెవ్వరు పాటలు ఒక్కొక్కటిగా మార్కెట్ లో హల్ చల్ చెయ్యడానికి రెడీ అవుతున్నాయి. 

అయితే ఇప్పుడు ఈ సినిమాపై ఓ పెద్ద రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే మహేష్ తో మహర్షి సినిమాని తెరకెక్కించిన వంశి పైడిపల్లి మళ్ళీ మహేష్ తో సినిమా చెయ్యడానికి మహేష్ కూడా తిరుగుతున్నాడు. లండన్ వెళితే లండన్ వెళ్ళాడు. క్రికెట్ చూడడనికి మహేష్ ఫ్యామిలీ వెళ్తే ఆక్కడికి వంశీ ఫ్యామిలీతో పాటుగా వెళ్లిపోయాయడు. ఇక మహేష్ పర్సనల్ పార్టీస్ లోను వంశీ పైడిపల్లి ఫ్యామిలీతో హడావిడి చేస్తున్నాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

ఇక మహర్షి సినిమాతో మహేష్ కి బాగా దగ్గరైన వంశీ పైడిపల్లి ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమా ఎడిటింగ్ విషయంలో జోక్యం చేసుకుంటున్నట్టుగా ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. సరిలేరు నీకెవ్వరు ఎడిటింగ్ టీంలో వంశీ కూడా ఉన్నాడని తాజా సమాచారం. అయితే వంశీ పైడిపల్లి మహర్షి సినిమాని దాదాపుగా 2.50 నిమిషాల నిడివి కట్ చేసి... సినిమా నెగెటివ్ పాయింట్స్ లో నిడివి ఉండేలా చేసాడు. మరి ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు ఎడిటింగ్ విషయంలో వంశీ జోక్యాన్ని మహేష్ ఎలా ఒప్పుకున్నాడోనని చర్చించుకుంటున్నారు. మహేష్ కావాలనే వంశీని పిలిపించాడని గుస గుసలు వినిపిస్తున్నాయి. మరి మహేష్ నిజంగా పిలిపించుకున్నాడా లేక వంశీ ఖాళీగా ఉండి వచ్చి కూర్చున్నాడా అని కామెంట్స్ పడుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: