‘బాహుబలి’ విడుదలకు ముందు రాజమౌళి ఆమూవీలోని పాత్రలను పరిచయం చేస్తూ వారికి సంబంధించిన ఒకొక్క పోస్టర్ ను విడుదల చేయడంతో ఆమూవీలోని పాత్రలు జనంతో బాగా కనెక్ట్ అయిపోయాయి. అప్పట్లో అలాంటి ట్రెండ్ ను రాజమౌళి వినూత్నంగా ప్రవేశపెట్టి తన ప్రయత్నంలో పరిపూర్ణ విజయం సాధించాడు.

ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ కోసం దర్శకుడు అనీల్ రావిపూడి ఈమూవీకి సంబంధించి కొన్ని కాన్సెప్ట్ టీజర్స్ ను రెడీ పెట్టి ఇప్పటి నుండి డిసెంబర్ చివరి వరకు ఆటీజర్స్ ను చిన్నచిన్న గ్యాప్స్ తో విడుదల చేస్తూ ఈమూవీలోని పాత్రలు జనానికి బాగా కనెక్ట్ కావడానికి ఒక కొత్త టెక్నిక్ ప్రవేశ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈకాన్సెప్ట్ టీజర్స్ రెడీ అయిపోయినట్లు సమాచారం. 

ఈప్రణాళికలో భాగంగా ఈసినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్న ఒకొక్క క్యారెక్టర్ మీద ఒక స్పెషల్ టీజర్ చాల విభిన్నంగా తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈమూవీలో కీలకపాత్రలో నటిస్తున్న విజయశాంతి ప్రకాష్ రాజ్ రాజేంద్రప్రసాద్ తో పాటు మహేష్ రష్మికల పై కూడ ఈస్పెషల్ టీజర్స్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఈమూవీకి సంబంధించిన ప్రతి పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయడమే కాకుండా ఆపాత్ర స్వరూపాన్ని రేఖా మాత్రంగా ముందుగానే సినిమాను చూడబోయే ప్రేక్షకులకు క్లారిటీ వచ్చేలా ఈటెక్నిక్ ను అనీల్ రావిపూడి ఎంచుకున్నట్లు టాక్. 

సాధారణంగా ఒక మూవీ టీజర్ లో హీరో పాత్రను ఎలివేట్ చేస్తూ మిగతా పాత్రలను కేవలం రేఖా మాత్రంగానే చూపెడతారు. అయితే ఇప్పుడు అనీల్ రావిపూడి అనుసరిస్తున్న ఈకొత్త టెక్నిక్ తో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలోని పాత్రలు ముందుగానే ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ అవ్వబోతున్నాయి. ఈప్రయోగంతో బన్నీ ‘అల వైకుంఠపురములో’ మ్యానియాకు కొంత వరకు చెక్ పెట్టాలని అనీల్ రావిపూడి వ్యూహం అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఈరోజు విడుదలకావలసిన ఈమూవీ సాంగ్ లిరికల్ వీడియోను ఈరోజు విడుదల చేయడంలేదని తెలుస్తోంది. ఈమూవీ యూనిట్ మొత్తం పోలాచ్చిలో ఉండిపోవడంతో ఈలిరికల్ వీడియో విడుదల కార్యక్రమం కొద్దిగా వెనక్కు జరిగినట్లు టాక్..   
 


మరింత సమాచారం తెలుసుకోండి: