‘అల వైకుంఠపురములో’ మ్యానియా రోజురోజుకు పెరిగి పోతుంటే ఒకవైపు ఆనంద పడుతున్న బన్నీ మారని త్రివిక్రమ్ అలవాట్లను చూసి తల పట్టుకున్తున్నట్లు టాక్. త్రివిక్రమ్ మాటలు రాయడంలో ఎంత పొదపరో డబ్బు ఖర్చు చేయడంలో అంత వృథాగా ఖర్చు పెడతాడు అన్న ప్రచారం ఉంది. 

వాస్తవానికి తాను ఖర్చుదారి మనిషిని అని త్రివిక్రమ్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో గతంలో చెప్పాడు. ‘అజ్ఞాతవాసి’ ‘అరవిందసమేత’ మూవీలకు వాటి రేంజ్ మించి త్రివిక్రమ్ ఖర్చు చేసాడు అన్న కామెంట్స్ గతంలో వచ్చాయి. బన్నీతో సినిమాను మొదలు పెడుతున్నప్పుడు తాను మారనని ఖర్చులు ఎక్కువ పెట్టను అనీ ఈ మూవీకి సహ నిర్మాతగా వ్యవహరించిన అరవింద్ కు మాట ఇచ్చినట్లు టాక్. ఈ మాటలపై అరవింద్ నమ్మకం పెట్టుకున్నాడు అని అంటారు. 

అయితే ‘అల వైకుంఠపురములో’ మూవీ చివరకు రావడంతో ఈ మూవీ బడ్జెట్ ఖర్చులు చూస్తున్న నిర్మాతలకు షాక్ తగిలినట్లు సమాచారం. ఈ మూవీ అల్లు అర్జున్ కెరియర్ లోనే అత్యంత ఖరీదైన సినిమాగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈ మధ్య ఈ సినిమాకు సంబంధించి జరిగిన ప్యారిస్ షూటింగ్ లో అత్యంత ఖరీదైన లోకేషన్స్ లో ఈ మూవీ షూటింగ్ తీయడంతో ఈ మూవీ బడ్జెట్ ఊహించిన స్థాయికన్నా చాల మించిపోయింది అన్న వార్తలు వస్తున్నాయి. 

వాస్తవానికి ఈ సినిమాకు హారిక హాసినీ ప్రొడక్షన్స్ తో పాటు అరవింద్ కూడ నిర్మాత అవ్వడంతో ఈ సినిమాకు బిజినెస్‌ ఎంత బాగా జరిగినా కానీ నాన్‌ థియేట్రికల్‌ రైట్స్‌ కూడా కలుపుకుంటే తప్ప నిర్మాతలు బ్రేక్‌ ఈవెన్‌ కు రాలేరు అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ సినిమా గురించి త్రివిక్రమ్ పెట్టిన ఖర్చుల పై రకరకాలుగా కథనాలు వినిపిస్తున్న నేపధ్యంలో ఎప్పటికీ త్రివిక్రమ్ మారడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: