‘ఆర్ ఆర్ ఆర్’ లో నటిస్తూ వచ్చే ఏడాది తాను నటించే సినిమాల ఎంపిక కోసం జూనియర్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ రకరకాల కారణాలతో ఫెయిల్ అవ్వుతూ ఉండటంతో తారక్ అయోమయంలో పడిపోతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి వచ్చే ఏడాది మైత్రీ మూవీస్ బ్యానర్ లో ఒక సినిమాను చేస్తాను అంటూ జూనియర్ ఇప్పటికే ఆ సంస్థ నుండి భారీ అడ్వాన్స్ లు తీసుకున్నాడు.

‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ఒక కొలిక్కి వచ్చాక తన కొత్త సినిమాను వచ్చే ఏడాది మధ్యలో మొదలు పెట్టాలని జూనియర్ ఆలోచన దీనికోసం ప్రముఖ కన్నడ దర్శకుడు ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో అనేకసార్లు చర్చలు చేసాడు. అయితే తాను ఎప్పటికీ రాజమౌళి ప్రాజెక్ట్ నుండి బయటకు వస్తానో ప్రశాంత్ నీల్ కు క్లారిటీ ఇవ్వక పోవడంతో ప్రశాంత్ నీల్ మహేష్ వైపు టర్న్ తీసుకుని వచ్చే ఏడాది అతడితో మూవీ ప్రాజెక్ట్ కు ఫిక్స్ అయిపోయాడు.

అదేవిధంగా క్రేజీ తమిళ డైరెక్టర్ అట్లీ జూనియర్ తో సినిమా తీయాలని ఎన్నో ప్రయత్నాలుచేస్తున్నా ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి క్లారిటీ జూనియర్ కు లేకపోవడంతో అట్లీ జూనియర్ వెయిటింగ్ తట్టుకోలేక బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ వైపు వెళ్ళిపోయాడు. దీనితో జూనియర్ కు ఇక మిగిలింది టాలీవుడ్ కు సంబంధించిన టాప్ డైరెక్టర్స్ కొరటాల త్రివిక్రమ్ లు మాత్రమే.

కొరటాల ప్రస్తుతం చిరంజీవితో చేస్తున్న సినిమా తరువాత చరణ్ తో సినిమా చేయడానికి ఎగ్రిమెంట్ లో ఉన్నాడు. దీనితో ఒక్క త్రివిక్రమ్ తప్ప మరెవ్వరు జూనియర్ కు అందుబాటులో లేరు అని అంటున్నారు. సురేంద్ర రెడ్డితో పాటు మరికొంతమంది యంగ్ డైరెక్టర్స్ జూనియర్ వైపు చూస్తున్నా వారిని పూర్తిగా నమ్మలేని స్థితి తారక్ కు ఏర్పడింది అని అంటున్నారు. దీనితో వరస పెట్టి టాప్ డైరెక్టర్స్ అందరు మిస్ అవుతుంటే వారిని ఆపలేక వారు అడుగుతున్న క్లారిటీ ఇవ్వలేక ఒక విచిత్ర పరిస్థితిలో జూనియర్ ఇరుక్కున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: